ప్రమాదాలు ఎక్కడ నుంచి పొంచి ఉంటాయో ఎవ్వరికీ తెలియదు.  తాజాగా ముంబయి ఘట్కోపర్‌లో చార్టెడ్‌ విమానం కుప్పకూలింది. జూహూ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతుండగా కుప్పకూలిన విమానం.  ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు.  మృతుల్లో ఒకరు పైలట్..ముగ్గురు ప్రయాణికులు ఒకరు పాదాచారి. 
Image result for mumbai chartered plane crash
యూవై ఏవియేషన్ కు చెందిన చార్టెడ్ విమానం. కొద్ది రోజుల క్రితం విమానానికి రిపేర్లు చేసిన అధికార్లు.  టెస్ట్ డ్రైవ్ చేస్తుండగానే కుప్పకూలిపోయిన విమానం. పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: