గత కొంత కాలంగా మహిళలపై ఎన్నో దారుణాలు జరుగుతున్నాయి. వివవాహేతర సంబంధాలు దంపతుల మద్య అనుమానాలు తేవడం..ఒకరిపై ఒకరినొకరు విమర్శించుకోవడం..చివరకు అది హత్యల వరకు దారి తీస్తుంది. చెన్నై లోని దిండుగల్ దారుణం..భార్యను అత్యంత పాశవికంగా నరికి చంపాడు ఓ భర్త. రోడ్డు పై నడుచుకుంటూ వస్తున్న ఆమెపై ఆకస్మాత్తుగా పదునైన కత్తితో పాశవికంగా దాడి చేశాడు.
ఆస్పత్రిలో చికిత్సపొందుతూ భార్య ప్రియ మృతి. ఈ ఘటన చెన్నైలోని దిండుగల్ జిల్లాలో గత నెల 20న ఈ సంఘటన చోటు చేసుకున్నా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హంతకుడి పేరు మదీశ్వన్ అని తేలింది.
కేవలం భార్యపై అనుమానంతోనే హంతకుడు ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది. హత్య చేసిన వెంటనే భర్త అక్కడ నుంచి పారిపోయాడని..ప్రస్తుతం అతడు పోలీసు అదుపులో ఉన్నట్లు తెలుస్తుంది.