యువకుడు కాకపోయినా రాజకీయాల్లో చిన్నవాడు అమాయకుడైన రాహుల్ గాంధి వారసత్వంతో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు అయ్యారు. ఇప్పటి వరకు తల్లి కొంగు చాటు బిడ్డడుగా ఉన్న ఆయన అలవాట్లు కాంగ్రెస్ వాళ్లకు తప్ప వేరే వాళ్లకు పెద్దగా తెలియవు.
అయితే, రాహుల్ గాంధీ పై ఎప్పుడూ లేనంత తీవ్రమైన ఆరోపణను చేశారు బీజేపీ రాజ్యసభ నేత సుబ్రమణ్యస్వామి. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన తీవ్రమైన సంచలన అంశాల్ని బయట పెట్టారు. రాహుల్ గాంధీ కి డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉందని భారీ ఎత్తున బురద చల్లేశారు అంటున్నారు. ఆ అరోపణలు నిజమని ఋజువు అయ్యే వరకు మనం వాటిని బురద జల్లుడు గానే తీసుకుందాం.
సుబ్రమణ్య స్వామి తాను చెప్పిన మాట అబద్ధమని నిరూపించాలని ఆయన చాలంజ్ చేశారు. కావాలంటే రాహుల్ గాంధికి డోపింగ్ టెస్ట్ ను చేయిస్తే, అసలు విషయాలు చాలా నే బయట పడతాయన్న ఆయన మాట సంచలనంగా మారింది. అంటే ఆయన అంతగా అంటున్నారంటే ఆ ఆరోపణపై నమ్మకం ఉంచాల్సి వస్తుంది. తాజాగా పంజాబ్ ప్రభుత్వం ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్-టెస్ట్ ను నిర్వహించాలని పేర్కొంటూ ఒక కొత్త సంచలనానికి తెర తీశారు.
ఈ సందర్భంగా స్వామి కొన్ని అంశాలపై విరుచుకుపడ్డారు.
పంజాబ్ ప్రభుత్వ నిర్ణయం నేపథ్యం లో ముందుగా కాంగ్రెస్ చీఫ్ కమాండో రాహుల్ గాంధీ కి డోప్-టెస్టు నిర్వహించాలని కోరారు. తనకు తెలిసినంత వరకూ రాహుల్ ఈ టెస్టులో తప్పక పెయిల్ అవుతారన్నారు. ఎందుకంటే, రాహుల్ కోకైన్ తీసుకుంటారంటూ స్వామి వ్యాఖ్యలు ఇప్పుడు ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.
సుబ్రమణ్య స్వామి మాటలు ఇలా ఉంటే వాటికి అదనంగా కేంద్ర మంత్రి హర్ సిమ్రత్ కౌర్ బాదల్ సైతం రాహుల్ గాంధి పై వ్యాఖ్యలు చేయటం గమనార్హం. పంజాబ్ లో డ్రగ్స్-అడిక్ట్స్ ఎక్కువగా ఉన్నట్లు రాహుల్ ఆరోపిస్తూ ఉంటారంటూ ఆమె మండిపడ్డారు. 70 శాతం పంజాబ్ యువత డ్రగ్స్ మత్తులో జోగుతోందని రాహుల్ అంటారని కానీ ఆయన పార్టీలో ఉన్న డ్రగ్-అడిక్ట్స్ కు ముందుగా డోప్ టెస్టులు చేపట్టాలని అన్నారు. రాహుల్ గాంధి తోనే డోప్-పరీక్షలు మొదలు పెడితే బాగుంటుందని అంటూ ఆమె వ్యాఖ్యానించటం ఆసక్తికరంగా, ఇంకా సంచలంగా మారింది.