ఏపిలో ఎప్పుడూ రాజకీయాల్లో బిజీ బిజీగా ఉండే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రస్తుతం ప్రజా సంకల్ప యాత్ర చేస్తున్నాడు.  తాజాగా ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.  అదేదో..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తిట్టడమో..జనసేన అధ్యక్షుడిపై సెటైర్లు వేయడమో కాదు..పోనీ ‘ప్రజా సంకల్ప యాత్ర’కు సంబంధించింది కూడా కాదు..మరి ఏంటా వైరల్ వీడియో అనుకుంటున్నారు.   

పోయిన సంవత్సరం జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో న్యూజిలాండ్ కు విహారయాత్రకు వెళ్లిన సంగతి తెలిసిందే.  ఎప్పుడూ రాజకీయాలతో సతమతమవుతున్న నేతలు, సినీ తారలు అలా విహార యాత్రలకు వెళ్లి సేద తీరుతుంటారు.  ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తన కుటుంబసభ్యులతో కలసి ఆ పర్యటనను ఎంజాయ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన ఒక సాహసం చేశారు. ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కవారా బ్రిడ్జ్ పై నుంచి ఆయన 134 మీటర్ల బంగీ జంప్ చేశారు.  తాజాగా దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది..మీరో ఓ లుక్ వెయ్యండి.


మరింత సమాచారం తెలుసుకోండి: