ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా టీడీపి వర్సెస్స్ వైసీపీ  మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది.  ఇదిలా ఉంటే ఈ మద్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ సైతం టీడీపీని టార్గెట్ చేసుకొని విమర్శలు సందిస్తున్నారు.  ముఖ్యంగా పవన్ కళ్యాన్ ఏపి మినిస్టర్ నారా లోకేష్ బాబు పై సంచలన వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టీడీపీపై విమర్శలు గుప్పిస్తున్న వైసీపీ అధినేత జగన్, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ ల పై మంత్రి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 
Image result for pawan
కర్నూలు జిల్లాలో ఈరోజు ఆయన పర్యటించిన ఆయన నాగలాపురం పొలాల్లోని పంట కుంటలను ఆయన పరిశీలించారు.  ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ..రాష్ట్రాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న చంద్రబాబు అభివృద్ధి పుత్రుడు అయితే, అవినీతి పుత్రుడు జగన్ అని, ప్రధాని మోదీ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ అన్నారు. 
Image result for jagan
అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించామన్నారు. ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి నారా లోకేష్  తెలిపారు. ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: