మొత్తం 203 క్యాంటీన్లను ఏక రూపంలో కార్పొరేట్ హంగులతో నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ ఫుడ్ కోర్ట్సు మదిరిగా అదే స్థాయిలో అంతర్గత డిజైన్లు, ఇంటర్నెట్తో కంప్యూటర్ సదుపాయం, ఎలక్ట్రానిక్ టోకెన్ విధానం, సీసీ కెమెరాలు లబ్ధిదారుల ముఖాలు గుర్తించే పరిజ్ఞానం, టీవీలు వీటి ప్రత్యేకత. ఈ క్యాంటీన్లో 50 కి.మీ పరిధిలో సరఫరా చేసేలా ఆధునాతన సెంట్రలైజ్డ్ కిచెన్ ఉంటుంది. ఇక మెనూ విషయానికొస్తే ఉదయం అల్పాహారం మూడు ఇడ్లీ లేదా పూరి, 25 గ్రాము ఉప్మా, పొంగలి, మధ్యాహ్నం, రాత్రి 400 గ్రాముల అన్నం, 100 గ్రాముల కూర, 120 గ్రాముల పప్పు లేదా సాంబారు, 75 గ్రాముల పెరుగు పచ్చడి ఉంటుంది.
రోజు ఉదయం 7.30 గంటల నుంచి 10 గంటలకు అల్పాహారం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి 3 గంటల వరకు భోజనం, రాత్రి 7.30 గంటల నుండి 9 గంటల వరకు భోజనం. ప్రతి ఆదివారం శెలవు దినం. ఇతర ఆరురోజుల్లో ఏదో ఒక రోజు స్పెషల్ రైస్. ఇదిలా ఉండగా అన్న క్యాంటీన్ల ద్వారా అల్పాహారం, భోజనం అందించే బాధ్యతను అక్షయపాత్ర ఫౌండేషన్ స్వీకరించింది. ప్రతి రోజూ మూడుపుటలా కల్సి కనీసం 2 లక్షల, 15వేల మంది ఉంటారని ఓ ప్రాథమిక అంచనా. ఇందుకు కోసం ప్రభుత్వం రోజుకు రూ. 75 చెల్లిస్తుంది.
ఇందులో లబ్ధిదారు రూ. 15 చెల్లిస్తుండగా మిగిలిన రూ. 58లను ప్రభుత్వం సబ్సిడీగా భరిస్తున్నది. ఇదిలా ఉండగా అల్పాహారం కింద రూ.5 అన్నం, కూరలు కలిపి మొత్తం 800 గ్రాముల భోజనం పెడతారు. అది తిన్న తరువాత చాలకపోతే మరో టోకెన్ ఇస్తారు. ఈ విధంగా ఒక వ్యక్తికి ఒకటి లేదా రెండు టోకెన్లు ఇవ్వాలని భావిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ అన్నా క్యాంటిన్లు అమల్లోకి వస్తే రోజు కూలీలకు, పేదలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.