ఒకప్పుడు రాజరిక వ్యవస్థలో పెళ్లిళ్లు అంటే ఎంతో వైభోగంగా జరిగేవి..ముఖ్యంగా స్వయంవరం అనే సాంప్రదాయంతో వధువు కొంత మంది రాజకుమారులను చూసి అందులో తనకు నచ్చిన వారి మెడలో పూల దండ వేస్తే అతడిని వివాహం చేసుకోవచ్చు. తర్వాత వివాహ వ్యవస్థలో కొత్త కొత్త మార్పులు చేర్పులు వచ్చాయి..పెళ్లిమండపాలు..నూతన వధూ వరులు వెరైటీగా పెళ్లి మండపానికి రావడం జరుగుతుంది.  గుర్రాలపై ఊరేగింపులు, పెళ్లి పల్లకీల స్థానంలో హెలికాప్టర్లు ప్రవేశించాయి. ఇటీవలే ఓ కొత్త జంట బుల్డోజర్ ఎక్కి విహరించింది కూడా.

తాజాగా మరో జంట ఇంకాస్త వెరైటీగా కల్యాణ మండపంలోకి ప్రవేశించగా, ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.  ఆకాశం నుంచి నూతన వధూ వరులను ఓ పంజరంలో ఉంచి..దానికి ఓ పెద్ద గద్ద మోసుకు వస్తున్నట్లు సీన్ క్రియేట్ చేశారు. ఆ సమయంలో పంజరం నుంచి వెలుగులు విరజిమ్మాయి.

ఈ దృశ్యాలను వీడియో తీసిన కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేయగా, వారి ఎంట్రీకి వధూవరులు 'వహ్... ఏం వెరైటీ' అంటున్నారు.  ఆ సమయంలో బహారో ఫూల్‌ బర్సావో మేరా మెహబూబ్ ఆయాహై..." పాట బ్యాక్ గ్రౌండ్ లో ప్లే అవుతుండటం ఈ వీడియోకు మరింత అందాన్ని తెచ్చింది.  కొంత మంది నెటిజన్లు మాత్రం వామ్మో మరీ ఇంత బిల్డప్ తో పెళ్లా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: