మద్యం మత్తులు తామేమి చేస్తున్నామో అన్న విచక్షణ కోల్పోయి ఎన్నో దారుణాలకు వడికడుతున్నారు కొంత మది వ్యక్తులు.  తీరా మద్యం మత్తు దిగిన తర్వాత తమ తప్పు తెలుసుకున్నా అప్పటికే జరగాల్సిన అనర్ధాలు జరిగిపోతున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో ఇద్దరు మైనర్ల మద్య మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగా కత్తితో కొంతు కోయడంతో యువకుడు చనిపోయాడు. ఒక చిన్న గొడవ యువకుడి ప్రాణాలు తీసే స్థాయికి చేరుకుంది.  ఈ ఘటన హైదరాబాద్ లోని శేరిలింగంపల్లిలో జరిగింది.

పదిహేడేళ్ల వయసు గల ఇద్దరు మైనర్ల మద్య వచ్చిన ఘర్షణ ప్రాణాలు తీసే పరిస్థితికి వచ్చింది.  సంపత్,అజయ్ ఇద్దరు స్నేహితులు.  కాగా, వీరిద్దరూ చిన్ననాటి నుంచి స్నేహితులుగా మెలిగారు.

అజయ్ బాబు గొంతు కోశాడు సంపత్. మద్యం మత్తులో ఘర్షణ పడి ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలోనే అజయ్ బాబు మృతి చెందాడు. హత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: