భారత దేశంలో కామాంధులు చిత్తకార్తి కుక్కల్లా రెచ్చిపోతున్నారు..సమాజాంలో పదిమందిలో తిరుగుతున్నా..వీరు చేసే అఘాయిత్యాలు సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నాయి. తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. దివ్యాంగురాలైన మైనర్ బాలికపై మానవ మృగాలు పైశాచికానికి పాల్పడ్డాయి. వినికిడి లోపం ఉన్న 13 ఏళ్ల బాలికపై ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 17 మంది కామాంధులు అత్యాచారం జరిపారు. మత్తుమందు ఇచ్చి లిప్ట్, బాత్రూమ్స్లలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు.
మృగాలంతా అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్, లిప్ట్ ఆపరేటర్లు, పనిమనుషులు కావడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ పారిశ్రామికవేత్తకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె హాస్టల్ ఉండి చదువుకుంటుండగా, అంగవైకల్యం చెందిన చిన్న కుమార్తె(13) తమ సొంత అపార్ట్ మెంట్ ఉంటూ ఏడో తరగతి చదువుతుంది. ఇదిలా ఉండగా బాలికపై కన్నేసిన లిప్ట్ ఆపరేటర్ బాలిక పాఠశాల నుంచి తిరిగి వచ్చే క్రమంలో అపార్ట్మెంట్లో ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
తర్వాత అతని స్నేహితులను పిలిచి సామూహికంగా అత్యాచారం చేయడం మొదలు పెట్టారు. తర్వాత వారి స్నేహితులను పిలిచి..ఇలా 17 మంది ఆ బాలికను దారుణంగా అత్యాచారాం చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో బాలికకు మత్తుమందు ఇస్తూ..అరవకుండా చేస్తూ వచ్చారు. అంతే కాదు బాలిక నగ్న ఫోటోలు చూపించి ఇంట్లో చెబితే అందరికీ చూపిస్తామని బెదిరించారు. ఇదిలా ఉండగా బాలిక అక్క సెలవులకు ఈ నెల 13న చెన్నైకి వచ్చారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న బాలికను గమనించి విషయం ఏంటని అడగ్గా.. బాలిక అసలు విషయం చెప్పింది. వెంటనే ఆ దారుణాన్ని తన తల్లిదండ్రులతో చెప్పడంతో జనవరి15న లిప్ట్ ఆపరేటర్ రవి(66) తన కూతురిపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ మెదలెట్టిన పోలీసులు బాలిక చూపించిన 17మందిని అరెస్ట్ చేసి సైదాపేట న్యాయస్థానం హాజరు పరిచారు.
ఉగ్రరూపులైన లాయర్లు :
దివ్యాంగురాలైన ఆ బాలిక పట్ల అంత దారుణానికి వడికట్టిన 17మంది కామాంధులను సైదాపేట కోర్టు న్యాయవాదులు పిచ్చికుక్కలను కొట్టినట్లు కొట్టారు. కోర్టు లోపలికి వచ్చిన నిందితులు తమ తరఫున వాదించాలని లాయర్లను కోరేందుకు వెళ్లారు. అయితే ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన న్యాయవాదులు.. మూకుమ్మడిగా నిందితులపై దాడికి దిగారు. పై అంతస్థు నుంచి కొట్టుకుంటూ కిందకు వచ్చారు. ఎలాగో అలా పోలీసులు ఆ దుర్మార్గులను రక్షించి జైలుకు తరలించారు.