జాతీయ నటుడు మళియాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రస్తుతం వైఎస్సార్ బయోపిక్ ‘యాత్ర’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.  ఈ సందర్బంగా ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లో తెలంగాణ ఐటి మినిస్టర్  కె.తార‌క రామారావును క‌లిశారు.   నెల 25వ తేదీన హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న ‘కైరాలి పీపుల్ ఇన్నోటెక్ ’అవార్డుల‌ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా కేటీయార్‌ను ఆహ్వానించారు.

ఈ మేరకు వారిద్దరూ కార్యాలయంలో కలిసిన ఫోటోలను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. కాగా, మమ్ముట్టి ప్రస్తుతం దివంగత నేత వైఎస్ఆర్ బయోపిక్ చేస్తున్నారు.

కాగా, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాద‌యాత్ర ఆధారంగా తెర‌కెక్కుతున్న `యాత్ర‌` సినిమాలో వైఎస్సార్ నిజ‌జీవిత పాత్ర‌లో మ‌మ్ముట్టి నటిస్తున్న సంగ‌తి తెలిసిందే. మ‌హి వి రాఘ‌వ్ దర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ప్ర‌స్తుతం షూటింగ్ ద‌శ‌లో ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: