అసలు జెసి దివాకర రెడ్డి పూర్తిగా ఔట్ స్పోకెన్. మనసులో ఉన్నదాన్ని భేషజం లేకుండా సమయం సందర్భం సైతం చూసుకోకుండా ఎంతవారితోనైనా పసివాళ్లలా మాట్లాడేయగలరు. నిజంగా ఆయన సహజ స్వభావం ఇతరులలో హస్యచతురతను మేల్కొలుపుతుంది. అలాంటిదే ఒక సఘటన గమనిద్దాం నేటి ఒక సందర్భం.  
సోనియా గాంధీని నమ్ముకొని తాము నిలువునా మునిగిపోయామని తెలుగుదేశం పార్లమెంట్ సభ్యుడు జేసీ దివాకరరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని జేసీ దివాకర రెడ్డి నిర్భయంగా సోనియా గాంధీతో చెప్పడం విశేషం.
sonia and jc diwakar కోసం చిత్ర ఫలితం
జరిగిన కథేమంటే ఈ రోజు పార్లమెంటులో కేంద్రప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ, నిన్నటి వరకు బిజెపి భాగస్వామి కూడా అయిన టిడిపి అవిశ్వాసం తీర్మానం పెట్టిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పార్లమెంటులో ప్రవేసించిన కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి ఎదురుపడ్డారు. ఈ స్వల్ప సమయంలోనే తన ఆవేదన నంతా జేసీ దివాకరరెడ్డి సోనియా గాంధి ముందు ఉంచారు.


"తల్లీ రాష్ట్రాన్ని విభజించావ్! రెడ్లకు తీరని అన్యాయం చేశావ్! కాంగ్రెస్‌ ను నమ్ముకొని తెలుగు రాష్ట్రాల్లో రెడ్లు నిలువునా మునిగారు" అంటూ సోనియా గాంధికి రెండు చేతు లెత్తి  తనదైన సహజ సైలిలో దండం పెట్టారు. 


జేసీ దివాకరరెడ్డి వ్యాఖ్యలు విన్న సోనియా గాంధి నవ్వుతూ ముందుకెళ్లారు. జేసీ దివాకరరెడ్డి గతంలో కాంగ్రెస్‌ లో సీనియర్ నేతగానే కాదు ప్రముఖ నేతగా వెలుగొందారు గొప్పగా కొనసాగారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ లో మనుగడ కష్టమని భావించి, 2014ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీగా గెలిచిన సంగతి తెలిసిందే. జెసి దివాకర రెడ్డి స్టైలే వేరు కదా! పాపం ఆయనను రాజకీయంగా రెడ్ల ప్రాతినిధ్యం తగ్గిందనే వేదన కుదిపేస్తుందనుకుంట? 

sonia and jc diwakar కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: