తెలుగుదేశం పార్టీపై సరికొత్త ఆరోపణ చేశారు జనసేన అధిపతి పవన్ కల్యాణ్. నిన్న అవిశ్వాస తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ పాదాలు తాకి తెలుగు దేశం పార్టీ ఎంపీలు మొక్కు కున్నారని పవన్ కల్యాణ్ అన్నారు.  ఒకవైపు ధారుణంగా మోడీని బీజేపీని రాష్ట్రంలో తిడుతూ మరోవైపు డిల్లీలో టీడీపీ ఎంపీలు బీజేపీ నాయకుల కాళ్లకు మొక్కుతున్న వారిని తామెలా అర్ధం  చేసుకోవాలని  జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ ప్రశ్నించారు.
సంబంధిత చిత్రం
టీడీపీ ఎంపీలు మాట్లాడితే బీజేపీతో యుద్ధం అంటుంటారు, నిన్నటికి నిన్న ప్రధాని మోడీకి పాదాభివందనం చేయడాన్నిఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు పవన్‌ ట్వీట్ల ద్వారా. తెలుగుదేశం ఇప్పటికీ మిత్రులేనని రాజ్నాథ్ సింగ్‌ చెబుతున్నారని ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేసేది “ధర్మపోరాటం” ఎలా అవుతుందని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు.


ఎంపీ గల్లా జయదేవ్‌పై పవన్‌ కల్యాణ్ సెటైర్లు వేశారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఒక ఫోటోను కూడా ఉంచారు. గజిని సినిమాలో హీరో లాగా టీడీపీ వాళ్లకి "కన్వీనియంట్ మెమరీ లాస్ సిండ్రోం"  రోజు రోజుకీ పెరిగిపోతోందని అన్నారు. 

pawan kalyan on twitter image of TDP short term memory loss కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: