జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గ్యాంగ్ .. గత రెండు రోజులుగా వైసీపీ అధినేత జగన్పై రెచ్చిపోతూనే ఉంది. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎలాంటి విమర్శలైనా స్వీకరించే లక్షణం ఉండాలి! కానీ, అటు పవన్ కానీ, ఇటు ఆయన అభిమానులు కానీ.. ఇలాంటి లక్షణాలు ఎక్కడా కనిపించడం లేదు. రాజకీయాల్లో ఉన్న నాయకులు పోకచెక్కతో నువ్వొకటంటే.... తలుపు చెక్కతో నే రెండంటా! అనే టైపులోనే ఉన్నారు. అని అనిపించుకోవడం రాజకీయాల్లోనే జరుగుతుంది. పవన్.. జగన్ను కెలికాడు.. దీంతో కొన్నాళ్లుగా ఓర్చుకున్న జగన్.. పవన్ను ఏకంగా ఒక్కసారే కెలికేశాడు! అంతే తట్టుకోలేని బాధతో పవన్ విలవిల్లాడిపోయాడు. అయితే, దీనిని అడ్వాంటేజ్గా తీసుకుని జగన్ ఎవరో టాలీవుడ్ బ్యూటీతో రాసలీలు జరిపాడని పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తూ.. కొన్నిపోస్టులు చేసింది.
ఇది.. పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ అయింది. నిజానికి.. జగన్కు అలాంటి లక్షణాలే ఉండి ఉంటే.. పవన్ కన్నాముందే.. టీడీపీ తమ్ముళ్లు ఏనాడో బట్టబయలు చేసేవి. అంతెందుకు పవన్ను జగన్ ఏదో అన్నాడని పవన్ కన్నా ఎక్కువగా కన్నీరు పెడుతూ.. లబోదిబో మని ఏడుస్తున్న ఓ దమ్మున్న మీడియా.. నిజంగా జగనే .. పవన్ మాదిరిగా ఎక్కడైనా.. ఎప్పుడైనా వ్యవహరించి ఉంటే.. బయట పెట్టకపోయేదా? మరి వీరికేచిక్కని ఆ చిత్రమేదో తమకే లభించినట్టు పవన్ వీరాభిమానులు రెచ్చిపోయారు. గతంలో టాలీవుడ్కు చెందిన మోడల్, నటి అలేఖ్య ఏంజల్.. వైఎస్ జగన్తో దిగిన సెల్ఫీని పట్టుకుని పవన్ అభిమానులు నెట్టింట్లో పెద్ద హంగామా చేశారు.
నిజానికి అసలు ఆ సెల్ఫీ ఎక్కడ దిగారు..? ఏం జరిగింది? అనే విషయంపై ఎలాంటి ఆలోచన లేకుండానే విమర్శలు చేసేశారు. పెద్ద ఎత్తున దూషణలు కూడా అందుకున్నారు. ఇది పెద్ద విషయంగా మారడంతో నేరుగా.. ఏంజలే రంగంలోకి వచ్చి.. పవన్ అభిమానులు బుద్ధి చెప్పింది. వైఎస్ జగన్ తో సెల్ఫీ దిగినందుకు కొందరు నాపై ఇబ్బందికరమైన రూమర్స్ చేస్తున్నారు. అవన్నీ నిరాధారమైనవి. ఈ రూమర్స్ను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి వార్తలు అవమానకరమైనవి, అగౌరవరమైనవి. మా గౌరవం, కీర్తిని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. ఈ పుకార్లతో నేను చాలా హర్ట్ అయ్యాను. అని ఏంజల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సెల్ఫీకి సంబంధించి న విషయాన్ని కూడా ఆమె వివరించింది. 2017 ఫిబ్రవరి 18న లోటస్ పాండ్లో వైఎస్ జగన్ గారి చేతుల మీదుగా సీడీ లాంచింగ్ జరిగిందని తెలిపింది.
ఈ ఈవెంట్కు తను, తన కుటుంబ సభ్యులు హాజరయ్యామని, ఈవెంట్కు వచ్చిన చాలా మంది జగన్ ని రిక్వెస్ట్ చేసి ఆయనతో సెల్ఫీ దిగామని ఆమె వివరించింది. ఈ ఫొటోలను చూసిన కొందరు వైఎస్ జగన్పై నిందారోపణలు చేస్తున్నా రు. ఆయన తండ్రి లాంటివాడు.. మా పెద్దన్న లాంటి వాడు. ఇది మంచి పద్ధతి కాదని ఏంజల్ బుద్ది చెప్పింది. అంతేకాదు, ఇంత జరిగినా.. తాను పవన్ అభిమానని, ఒక నటిగా ఆయన్ను ఫాలో అవుతానని.. ఆదర్శంగా తీసుకుంటానని పేర్కొంది. ఎవరైనా సరే ఇలాంటి పోస్టులు చేసే ముందు ఆలోచించాలని హితవు పలికింది. మరీ ముఖ్యంగా ఆడవారి విషయంలో ఇలా చేయడం సరికాదని, నాపై ఎలాగైతే మీరు విమర్శలు గుప్పిస్తూ పోస్ట్లు పెడుతున్నారో.. నా స్థానంలో మీ(పోస్ట్ చేసిన వారు) సొంత అక్క లేదా చెల్లి ఉంటే ఇలానే చేస్తారా..?. గుడ్డిగా పోస్ట్ చేసేస్తూ వ్యక్తుల గౌరవాన్ని దెబ్బతీస్తారా..? అని కడిగి పారేసింది. సో.. ఇప్పటికైనా పవన్ గ్యాంగ్కు బుద్ధి వస్తుందో రాదో చూడాలి.