ఈ మద్య భార్యాభర్తల మద్య వస్తున్న కలతల వల్ల చిన్నారులు బలిఅవుతున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.  అంతే కాదు భర్యా భర్తల అక్రమ సంబంధాల వ్యవహారం కూడా అమాయకులైన చిన్నారులపై పడుతున్నాయి.  తాజాగా ఓ వ్యక్తి తన భార్యపై కోపంతో కన్న పిల్లలన్న విచక్షణ కూడా లేకుండా ముగ్గురు పిల్లలను దారుణంగా చంపాడు. 

వివరాల్లోకి వెళితే..చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో వెంకటేష్ అనే వ్యక్తి, భార్యతో గొడవపడి, ఆ కోపంతో తన ముగ్గురు పిల్లలనూ నీవా నదిలో పడేసి చంపేశాడు.  కొంత కాలంగా భార్య భర్తల విషయంలో తేడాలు రావడంతో..నిన్ను చంపి నీ పిల్లలను చంపుతా అంటూ బెదిరించిన వెంకటేష్ నిజంగానే తన ముగ్గురు పిల్లలను పునీత్ (6), సంజయ్ (3), రాహుల్ (1)లను వెంకటేశ్ నదిలో విసిరి, పారిపోగా, ముగ్గురు బిడ్డలూ మరణించారు. 

విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న వెంకటేశ్ కోసం గాలిస్తున్నారు. భార్యభర్తల మద్య వైరం వస్తే వాళ్లు చూసుకోవాలని కానీ..అన్యాయంగా చిన్న పిల్లలను చంపడంతో  వెంకటేష్ ను వెంటనే అరెస్ట్ చేసి, ఉరిశిక్ష విధించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: