తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంట విషాదం చోటు చేసుకుంది. ఆయన సోదరి లీలమ్మ ఈ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెను, హైదరాబాద్ లోని యశోదా ఆసుపత్రిలో చేర్చగా, చికిత్స పొందుతూ ఆమె మరణించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్ సోదరి మరణవార్త తెలుసుకుని అర్థాంతరంగా ముగించి హైదరాబాద్‌కు పయనమయ్యారు.

మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరనున్నారు.లీలమ్మ మృతివార్త తెలుసుకున్న కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేసీఆర్ రెండో సోదరి విమలాబాయి తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.  లీలమ్మ  మరణ వార్త వినగానే మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, సీఎం కేసీఆర్ సతీమణి శోభలు యశోద హాస్పిటల్‌కు చేరుకున్నారు.
CM KCR Sister Leelamma passes away - Sakshi
లీలమ్మ పార్థివదేహాన్ని ఆమె నివాసానికి తరలించారు. కేసీఆర్‌కు ఈమె నాలుగో సోదరి.. రాజన్న సిరిసిల్ల జిల్లా యల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామానికి చెందిన శంకర్‌రావుతో లీలమ్మకు వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కాంతారావు, మధుసూదన్‌రావు ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: