ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని గత కొన్ని రోజులుగా పార్లమెంట్ వద్ద రక రకాల వేషదారణలతో కనిపిస్తూ అందరినీ ఆకర్షిస్తున్న చిత్తూరు ఎంపీ ఎన్.శివప్రసాద్ గురువారం మరో కొత్త అవతారంతో కనిపించాడు.  జర్మనీ డిక్టేటర్ అడాల్ఫ్ హిట్లర్ వేషధారణలో పార్లమెంటు వద్ద నానా హంగామా చేశారు.  విభజన సమయంలో ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని కేంద్ర ప్రభుత్వం పచ్చి మోసం చేసిందని..ప్రధాని మోడీని ప్రజలు క్షమించబోరని ఆయన అన్నారు.  ఇప్పటి వరకు శివప్రసాద్ పాఠశాల పిల్లాడు, మాయల ఫకీరు, నారద ముని వేషాల్లో పార్లమెంట్ వద్ద నిరసన తెలుపుతూ వస్తున్నాడు.

కాగా, శివప్రసాద్ తాజా వేషంపై అక్కడ వారు ఆశ్చర్యపోవడమే కాదు..నెటిజన్లు కూడా కామెడీగా జోకులు వేస్తున్నారు. ప్రజలు తమ ఓట్లతో నాయకులను ఎన్నుకుంటే..వారు మాత్రం ఇలాంటి కామెడీ పనులు చేస్తూ నానా యాగి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. 

ముఖ్యంగా శివప్రసాద్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో చిన్నపిల్లలు వేసుకున్నట్లు డ్రెస్సులు వేసుకు వస్తున్నాడే తప్ప ఆయన నిజంగా పార్లమెంట్ లోకి వెళ్లి ప్రధానిని నిలదీయాలని అంటున్నారు.
Image result for mp shiva prasad
ఇంకొక నెటిజన్ అయితే శివప్రసాద్ ను ఇదే డ్రస్సుతో ఇజ్రాయెల్ కు పంపాలని కూడా సూచించాడు. శివప్రసాద్ స్కూల్ లో ఉన్నప్పుడు ఫ్యాన్సీ డ్రస్ పోటీలకు రెగ్యులర్ గా వెళ్లేవాడని మరో నెటిజన్ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: