నారా చంద్రబాబు నాయుడు ఆయన అధినేతృత్వం లోని తెలుగుదేశం పార్టీ అందులోని ప్రజాప్రతినిధులు బ్రాడ్ గా మహిళా వ్యతిరేఖలేనని ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణ మురళి మరోసారి ఉద్ఘాటించారు.  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీరుపై నటుడు పోసాని కృష్ట మురళీ ధ్వజమెత్తారు. రాజకీయం కోసం మహిళల ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేయించడం చంద్రబాబు నాయుడుకి అలవాటేనని అన్నారు. అప్పట్లో టీడీపీ కోసం విశేషంగా సేవలు అందించిన ఆంధ్రుల అభిమాన అందాల ఆరాధ్య నటి జయప్రద ను కూడా చివరకు అవమానకరంగా పార్టీ నుంచి బయటకు పంపించారని అన్నారు.
jayaprada chandrababu కోసం చిత్ర ఫలితం
ఎన్టీఆర్‌ ను వెన్నుపోటు పొడిచి, ఆయన్నుంచి నుంచి పార్టీని, పార్టీ బలగాల్ని నిర్ధాక్షిణ్యంగా లాక్కుని ఆయన మరణానికి కారణమైన చంద్రబాబు ఆ అపనిందను మాత్రం మహిళ అయిన లక్ష్మీపార్వతిపైకి వేశారన్నారు. టీడీపీలో విజయవంతంగా పని చేసినప్పటికీ అనుకోని పరిస్థితుల్లో వైసీపీలో చేరిన రోజాపై దారుణమైన పదాలతో తన మందీ మార్భలంతో ఇప్పటికీ తిట్టిస్తున్నారని దుయ్యబట్టారు. 
 jayaprada Vs chandrababu కోసం చిత్ర ఫలితం
ఇలాంటి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ భారతీ పై కేసులు పెట్టించినా అందులో ఆశ్చర్యం లేదన్నారు. 90 శాతం మీడియాను, కులాన్ని అడ్డుకుపెట్టుకుని నారా చంద్రబాబు తనకు అనుకూలంగా కథనాలు రాయించుకుంటున్నారని విమర్శించారు. మహిళలను మానసికంగా చంపాలంటే మాటలు, శారీరకంగా చంపాలంటే మరో మార్గం అనుసరించడం ఎలాగొ చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగాతెలుసు. అలాంటి అసాంఘిక కార్యక్రమాలు చెయ్యటం వారికి అలవాటేనన్నారు.

YS Bharati & TDP కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: