ఏపీలో కీలక టీడీపీ నాయకుడు, చంద్రబాబుకు నమ్మినబంటు.. టీడీపీపై అమిత ప్రేమ కనబరిచే నెల్లూరు నుంచి ప్రాతి నిధ్యం వహిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి పార్టీ అధినేత చంద్రబాబు నుంచి ఊహించని షాక్ తగిలింది. ఇన్నాళ్లు తనకు తిరుగులేదని భావిస్తూ వచ్చిన చంద్రమోహన్రెడ్డి.. ఈ తాజా పరిణామంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిని ఎదుర్కొంటున్నారని అంటున్నారు ఆయన అనుచరులు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మరో ఆరేడే మాసాల్లోనే ఎన్నికలు ఉన్నాయి. దీంతో ఎక్కడిక్కడ నాయకులు టికెట్ ల కోసం నానా తిప్పలు పడుతున్నారు. పార్టీ అధినేత చంద్రబాబు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకు టికెట్ కావాలంటే.,. తమకు కావాలని ఎవరికి వారు కోరుతున్నారు.
ఇక, వారసుల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు మరింత మంది ఉన్నారు. తాము పోటీ నుంచి తప్పుకుంటా మా పిల్లల కు టికెట్ ఇవ్వండి అని కోరుతున్నవారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో అనంతపురం నుంచి ఎక్కువగా లేఖలు చంద్రబాబుకు అందుతున్నాయి. అయితే, వీటిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోని చంద్రబాబు.. తాజాగా మాత్రం చూచాయగా ఓ విషయాన్నిమీడియాకు వెల్లడించారు. త్వరలోనే 40 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను వెల్లడిస్తానని ఆయన ప్రకటించారు. దీంతో ఈ జాబితాలో తమ పేరు ఉంటుందేమో.. అని నేతలు తెగ సంబర పడుతున్నారు., ఇక, నెల్లూరు నుంచి రాజకీయ చక్రంతి ప్పుతున్న సోమిరెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో తన వారసుడికి టికెట్ ఇవ్వాలని బాబుకు ఇప్పటికే అభ్యర్థనలు పంపారు.
ఈ అభ్యర్థనపైనా చంద్రబాబు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. వాస్తవానికి వరుస పెట్టి పరాజయం పాలవుతున్నారు సోమిరెడ్డి. ఈ నేపథ్యంలో ఈయన తనయుడికి టికెట్ ఇస్తే.. పోయిపోయి వైసీపీకి విజయం కట్టబెట్టినట్టే అవుతుందని ఆయన బావిస్తున్నారు. ఈ క్రమలోనే మౌనం వహిస్తున్నారు. అయితే, తాజాగా రూపొందిస్తున్న 40 మంది అభ్యర్థుల జాబితాలో.. సోమిరెడ్డి ఫ్యామిలీకి ఒకే ఒక్క టికెట్ కేటాయించినట్టు విషయం లీకైంది. అంతే! సోమిరెడ్డికి టెన్షన్ పట్టుకుంది. తనకు, తనకుమారుడికి కూడా రెండు టికెట్లు ఇస్తారని భావిస్తే.. ఇలా ఒకే టికెట్ అది కూడా సర్వేపల్లి కేటాయించడం ఏమిటని తన అనుచరుల ముందు వాపోయారట! అంతేకాదు, తనకుమారుడు పోటీ చేయాలా? తాను పోటీ చేయాలా? అని కూడా విస్మయం వ్యక్తం చేశారట సోమిరెడ్డి! ఇదీ ఇప్పుడు అధినేత ఇచ్చిన షాక్ అని సోమిరెడ్డి వర్గం బాహాటంగానే చెబుతోంది.