డాలస్: ఆగస్ట్ 29:  ప్రతి రెండేళ్లకు ఒక్కసారి అంగరంగవైభవంగా జరిపే నాట్స్ అమెరికా తెలుగుసంబరాలపై చర్చించేందుకు నాట్స్ డాలస్ లో  సమావేశమైంది. వచ్చే ఏడాది జరిగే ఈ సంబరాల కోసం నాట్స్ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించింది. డాలస్ లో  నాట్స్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మంచికలపూడిలు కలిసి నాట్స్ కీలక సభ్యులతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ సారి సంబరాలు  డాలస్ వేదికగా మెమోరియల్ వీకెండ్ లో జరగనుండటంతో డాలస్ టీం ఇప్పటి నుంచే చేపట్టాల్సిన కార్యచరణపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.
image1.png
డాలస్ టీం సభ్యులతో పాటు పాటు నాట్స్ చాప్టర్స్ కు చెందిన నాయకులు ఈ సమావేశానికి హజరయ్యారు. ముఖ్యంగా నాట్స్ నాయకత్వం నుంచి కిషోర్ కంచర్ల, బాపు నూతి, రాజేంద్ర మాదాల, ఆది గెల్లి, శేఖర్ అన్నే, కిషోర్ వీరగంధం, శ్రీనివాస్ కొమ్మినేని, సురేంద్ర దూళిపాళ్ల, భాను, సుధాకర్ పెన్నం, జ్యోతి వనం, ప్రసాద్ కండేరి, విజయ్, రాజాజీ, పూర్ణ, సాయి, మణిందర్, వెంకట్ పోలినీడు, అశోక్ గుత్తా,  శరత్ గూడూరు, సాయి కాటూరు, ఆస్టిన్ నుంచి రాజేశ్ చిలుకూరి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  నాట్స్ డాలస్ టీం ఇప్పటికే చేస్తున్న కార్యక్రమాలు.. చేపట్టబోయే కార్యక్రమాలను ఇందులో వివరించింది. డాలస్ టీం పక్కా ప్రణాళికతో సంబరాల కోసం చేస్తున్న కృషిని శ్రీనివాస్  గుత్తికొండ, శ్రీనివాస్ మంచికలపూడి ప్రత్యేకంగా అభినందించారు.
image2.png

మరింత సమాచారం తెలుసుకోండి: