అనుమానం పెను భూతం అంటారు..ఈ మద్య మానవ సంబంధాలు దారుణంగా తయారయ్యాయి.  ముఖ్యంగా అక్రమ సంబంధాల నేపథ్యంలో పచ్చటి సంసారాలు భగ్గుమంటున్నాయి.  తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉందని నెపంతో ఓ వ్యక్తి భార్య తల నరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కి తీసుకు వెళ్లిన ఘటన సంచలనం రేపుతుంది. బెంగళూరు చిక్కమంగళూరు జిల్లాకు చెందిన సతీష్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.  తొమ్మిది సంవత్సరాల క్రితం రూప అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు..ఈ జంటకు ఇద్దరు చిన్నారులు.  


అయితే సతీష్ తనకు వచ్చే సంపాదన సరిపోవడం లేదని..మటన్ కొట్టు పెట్టాడు.  అయితే సతీష్ కి ఇదే ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి స్నేహితుడు అయ్యాడు.  అప్పుడప్పుడు మటన్ షాపు కి రావడం కలిసి మాట్లాడుకోవడం..ఇంటికి రావడం లాంటివి చేస్తున్నాడు.  ఆ సమయంలో సునీల్ కి రూపకు పరిచయం ఏర్పడి అది కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిందని సతీష్ కి అనుమానం మొదలైంది. ఈ  వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. స్థానికులు కూడా కల్పించుకుని రాజీ ప్రయత్నం చేశారు. 


అయినా రూప, సునీల్‌ల వ్యవహారంలో మార్పు లేదు. ఒకానొక సందర్భంలో సునీల్, రూప కలిసి ఒకే బెడ్ పై దారుణమైన స్థితిలో చూసిన సతీష్ కోపాన్ని ఆపుకోలేక పోయాడు..వెంటనే పక్కన ఉన్న కొడవలితో  సునీల్ మీదకి దాడి చేశాడు..కానీ అప్పటికే సునీల్ తప్పించుకోగా..భార్య రూప పై దాడి చేసి తలను నరికేశాడు.  అయినా అతని కసి తగ్గలేదు..ఆ తలను తీసుకొని సుమారు  20 కిలోమీటర్ల దూరంలో ఉన్న అజ్జంపుర పోలీస్ స్టేషన్‌ వెళ్లాడు.  చేతిలో తలను చూడలంతో పోలీసులు షాక్ తిన్నారు.  సతీష్ ని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: