ప్రపంచం ఇప్పుడు టెక్నాలజీ రంగంలో ఎంతో ఎత్తుకు ఎదిగింది. కానీ భారత దేశంలో ఇంకా కుల మతాలు అంటూ కొట్టుకొని ఛస్తున్నారు. మత విద్వేశాలతో రగిలిపోతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య కలకలం సృష్టించింది. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న పాపానికి ఓ కుమార్తె నిండు జీవితాన్ని సర్వనాశనం చేశాడా తండ్రి.   రెండు మూడు రోజులుగా ఈ జంటను వెంబడిస్తున్న హంతకుడు, శుక్రవారం సాయంత్రం వీరు ఆసుపత్రి నుంచి బయటకు వస్తుండగా పథకాన్ని అమలు చేశాడు. వెంట తెచ్చుకున్న పెద్ద కత్తితో వెనక నుంచి వచ్చి యువకుడి మెడపై వేటేశాడు. దాంతో ప్రణయ్ కుప్పకూలిపోగానే తలపై మరో వేటేశాడు.అంతే, రక్తపు మడుగులో అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. 

Image result for pranay murder

ప్రేమ పెళ్లి చేసుకున్న కారణం చేత అన్యాయంగా తమ తళిత కులానికి చెందిన యువకుడిని హత్యచేయించారని దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.   దళిత యువకుడు ప్రణయ్ హత్యకు నిరసనగా దళిత సంఘాలు ఈ రోజు మిర్యాలగూడలో బంద్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు మారుతీరావు ఇంటివద్ద భారీ భద్రతను ఏర్పాటుచేశారు.


కుమార్తె ఇష్టంలేని పెళ్లిచేసుకోవడంతో ఆగ్రహించిన తండ్రి మారుతీరావు అల్లుడిని దారుణంగా చంపించిన వైనం మిర్యాల గూడలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.  ఇంజనీరింగ్ చదివిన ప్రణయ్, అమృతల మధ్య ప్రేమ చిగురించింది. ఇందుకు అమ్మాయి కుటుంబం ఒప్పుకోకపోవడంతో వీరిద్దరూ హైదరాబాద్ లోని ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. 


తన కుటుంబానికి ఏమైనా జరిగితే తండ్రిదే బాధ్యతని డీఎస్పీకి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు మారుతీరావుకు కౌన్సెలింగ్ నిర్వహించారు. దీంతో మారినట్లు నటించిన అతను, అల్లుడి హత్యకు రూ.10 లక్షలతో డీల్ సెట్ చేశాడు. ఓ కిరాయి హంతకుడిని ఇందుకు నియమించుకున్నాడు. ప్రస్తుతం ఐదో నెల గర్భవతిగా ఉన్న అమృతను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా అక్కడే ప్రణయ్ పై పదునైన కత్తితో ఆ దుండగుడు దాడి చేసి హత్య చేశాడు.  కాగా, ప్రేమించిన పాపానికి యువకుడి హత్యకు నిరసనగా అక్కడి ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: