మనదేశం స్వాతంత్రం పొందడానికి ప్రధమ స్వాతంత్ర పోరాటం జరిగిన 1857 సంవత్సరం నుండి చిట్ట చివరకు బ్రిటీష్ వారిని మన దేశం నుండి తరిమివేయడానికి 90సంవత్సరాలు పట్టింది.  భారతదేశం స్వాతంత్రం పొందడానికి కొన్ని వేల సంఖ్యలో స్వాతంత్ర సమరయోధులతో పాటు విప్లవ కారులు కూడ పాల్గొన్నారు. ఈ విప్లవ కారులో భారత ప్రజల హృదయాలలో ఇప్పటికీ చిరంజీవిగా జీవిస్తున్న భగత్ సింగ్ పేరు తెలియని వారుండరు. భారత స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన అత్యంత ప్రభావశీల విప్లవకారులలో ఆయన ఒకడు.


ఈ కారణంగానే 'షహీద్ భగత్ సింగ్ గా కొనియాడబడతాడు'.  ఇప్పుడు పాకిస్తాన్‌లో ఉన్న లాయల్ జిల్లా బంగా గ్రామంలో కిషన్ సింగ్, విద్యావతి దంపతులకు భగత్ సింగ్ జన్మించాడు. భారత్‌ లో బ్రిటీషు పాలన ను వ్యతిరేకిస్తూ విప్లవాత్మక ఉద్యమాలను చేపట్టిన కుటుంబంలో ఆయన జన్మించాడు. యుక్త వయస్సులోనే ఐరోపా విప్లవ ఉద్యమాలను గురించి చదివిన సింగ్ అరాజకవాదం మరియు సామ్యవాదమునకు ఆకర్షితుడయ్యాడు.


భగత్ సింగ్ మరియు సుఖ్ దేవ్ ల కలిసి లాహోర్ కాన్సిప్పిరెన్సీలో భాగంగా కేస్ లాహోర్ సెంట్రల్ అంసెబ్లీ బాంబ్ బ్లాస్ట్ చేయడానికి ప్రయత్నించిన భాగంలో అప్పటి బ్రిటిష్ పోలీసు అధికారి జె.పి.సాండర్స్ ను హతమార్చినందులకు భగత్ సింగ్ అతడి సహచరులు రాజ్ గురు, సుఖ్ దేవ్ లను 1931 మార్చి 23న లాహోరు సెంట్రల్ జైలులో ఉరి తీశారు.  భగత్ సింగ్ త్యాగాల గురించి అనేక రచనలు సినిమాలు కూడ వచ్చాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: