మహాభారతంలో కురుక్షెత్ర యుద్ధ ప్రారంభ ఘడియలు సమీపిస్తున్న సమయంలో ఒక ప్రక్క పాండవులు మరోప్రక్క కౌరవులు యుద్ధానికి సిద్ధమౌతూ సైన్యసమీకరణ చేసుకునే తరుణంలో ఇరువురికి శ్రీకృష్ణుని అవసరమొచ్చింది. అలాగే నేడు ఇరు అగ్రరాజ్యాలు వాటి బల సమీకరణం చేసుకుంటున్నారు. అందుకే వారు భారత్ చేరువ అవ్వాలనుకుంటున్నారు. అందుకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ భారత పర్యటన ఖరారైంది. అక్టోబర్ 4, 5 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు భారత్‌లో పర్యటించ నున్నారు. 19వ భారత-రష్యా వార్షిక ద్వైపాక్షిక సదస్సు కోసం పుతిన్‌ ఢిల్లీకి విచ్చేస్తు న్నారు.

 Image result for putin & Trump india visit

తన పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్, ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో అధికారికంగా సమావేశమవుతారు. పుతిన్ పర్యటన వివరాలను భారత విదేశాంగ శాఖ శుక్రవారం (సెప్టెంబర్ 28) ఓ ప్రకటనలో తెలిపింది. పుతిన్ భారత పర్యటన సందర్భంగా భారత్, రష్యా పలు అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకో నున్నాయి. భారత్ - రష్యా సంబంధాలు, సమకాలీన అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చించ నున్నారు. భారత్ - రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

 

2000 లో పుతిన్‌ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందం కుదిరింది. నాటి నుంచి భారత్‌-రష్యా సంబంధాలు వేగం పుంజు కున్నాయి. ఈ సంబంధాలు బాగా బలపడి నూతన అధ్యాయానికి తెరతీయడమే కాకుండా వివిధ రంగాల్లో రష్యా నుంచి మెరుగైన సహకారం లభించింది. గతేడాది జూన్‌ 1న జరిగిన ఇరుదేశాల వార్షిక ద్వైపాక్షిక సమావేశానికి మోదీ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే.

 

ముఖ్య అతిథిగా  భారత గణతంత్ర వేడుకలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ !

Image result for putin & Trump india visit 

మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనపై వార్తలు జోరందుకున్నాయి. డొనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌లో పర్యటించేందుకు ఆసక్తిగా ఉన్నారని, అందుకు సమయం కోసం ఆయన ఎదురుచూస్తున్నారని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.

 

2019 గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా రావాలంటూ భారత ప్రభుత్వం ట్రంప్‌కు ఇప్పటికే ఆహ్వానం పంపింది. అయితే.. అమెరికా నుంచి ఈ ఆహ్వానంపై ఇప్పటివరకూ ఎలాంటి సమాచారం రాలేదు. అయితే.. భారత్‌లో పర్యటించడానికి ట్రంప్‌ ఆసక్తిగా ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

 

ప్రస్తుతం అమెరికా, ఇతర దేశాల్లో ట్రంప్‌ కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే షెడ్యూల్‌ ఖరారైంది. వీటిని పరిగణనలోకి తీసుకుని భారత పర్యటన విషయంపై శ్వేతసౌధం నిర్ణయం తీసుకోనుంది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారత్-అమెరికా దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగవుతున్నాయని, ఇరు దేశాల అధికారుల మధ్య ఇప్పటివరకు 40సార్లు చర్చలు జరిగాయని అధికారులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: