కృషి ఉంటే మనుషులు రుషులవుతారు..మహాపురుషులవుతారు...అన్న పాట అక్షర సత్యం చేశారు..ఎపిజె అబ్దుల్ కలాం.  పెద కుటుంబంలో పుట్టిన కూడా ఆ పేదరికాన్ని జయించి..ప్రపంచ స్థాయి గురించే శాస్త్రవేత్తగా ఉన్నత శిఖరానికి చేరుకున్న మహానుభావుడు అబ్దుల్ కలామ్.  ఎంతో మంది యువ శాస్త్రవేత్తలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.  ఆయన చేసిన ప్రయోగాలు భారత దేశాన్ని శాస్త్రవిజ్ఞానంలో ముందంజలో నిలిచేలా చేశాయి.  అవుల్ పకీర్ జైనుల్బదీన్ అబ్దుల్ కలాం రామేశ్వరం, రామనాథపురం జిల్లా, తమిళనాడు రాష్ట్రంలో ఒక తమిళ ముస్లిం కుటుంబంలో 1931, అక్టోబరు 15 న జన్మించాడు.   

తండ్రి జైనుల్బదీన్, పడవ యజమాని మరియు తల్లి ఆశిఅమ్మ, గృహిణి. పేద కుటుంబ కావటంతో కుటుంబ అవసరాలకు చిన్న వయసులోనే పని ప్రారంభించాడు. పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత, తన తండ్రికి ఆర్థికంగా తోడ్పడటానికి వార్తాపత్రికలు పంపిణీ చేశాడు.   పాటశాలలో సగటు మార్కులు అయినప్పటికీ నేర్చుకోవటానికి తపన పడేవాడు మరియు ఎక్కువ సమయం కష్టపడేవాడు. రామనాథపురం స్క్వార్జ్ మెట్రిక్యులేషన్ స్కూల్ లో తన పాఠశాల విద్య పూర్తి చేశాక, కలాం సెయింట్ జోసెఫ్స్ కళాశాల, తిరుచిరాపల్లి చేరి, 1954 లో భౌతికశాస్త్రం నందు పట్టా పొందారు.

అప్పట్లో ఈ కళాశాల మద్రాస్ విశ్వవిద్యాలయం అనుబంధ సంస్థగా ఉండేది. ఈ కోర్సుపై అతనికి కోర్సు పూర్తి అయ్యేవరకు మక్కువ కలగలేదు. నాలుగు సంవత్సరాలు ఈ కోర్సు చదివినందుకు తరువాత చింతించారు. 1955లో మద్రాసులో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేరారు.    కలాం సీనియర్ తరగతి ప్రాజెక్ట్ పనిచేస్తుండగా, పురోగతి లేకపోవడంతో డీన్ అసంతృప్తి చెంది ప్రాజెక్ట్ తదుపరి మూడు రోజుల్లో పూర్తి చేయకపోతే తన స్కాలర్షిప్ ఎత్తివేస్తాను అని బెదిరించాడు.

ఇచ్చిన గడువులో కష్టపడి పని పూర్తిచేసి డీన్ ను ఆకట్టుకున్నాడు.  తరువాత డీన్  కలాం నీకు తక్కువ గడువు ఇచ్చి ఎక్కువ ఒత్తిడి కలిగించాను  ఆన్నారు. ఎనిమిది స్థానాల కొరకు జరిగిన ప్రవేశ పరీక్షలో తొమ్మిదో స్థానం పొంది యుద్ధ పైలట్ కావాలనే తన కలను తృటిలో కోల్పోయాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: