అబ్దుల్ కలామ్.. దేశం గర్వించే దేశభక్తుడు.. కానీ ఆయనకు గురించి మనకు తెలియని ఎన్నో విషయాలు ఆయన సెక్రటరీగా పనిచేసిన పీ ఎం నాయర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ విషయాలు తెలుసుకుంటే కలామ్ పై ఉన్న అభిమానం రెండింతలవ్వడం ఖాయం. అవేంటో చూడండి.


1 .  డాక్టర్  కలాం  గారు  భారత   రాష్ట్రపతిగా   వివిధ  దేశాలు   పర్యటించినపుడు  ఆయన  కు  ఆ యా  దేశాల  వారు  ఇచ్చిన  బహుమతులను తిరస్కరిస్తే అది   వారి  దేశాన్ని  అవమానించినట్టు  వారు  బాధపడతారు  అని   అది  మన  దేశాన్ని  ఇరకాటం  లో  పెడుతుంది   అని  వాటిని  తీసుకునే  వారు   .  ఇండియా  తిరిగి  రాగానే   వాటికి   ఫోటో  తీయించి  వాటికి   కేటలాగు   తయారు  చేయించి   అన్నీ   ఆర్కైవ్స్  లో  భధ్రపరిచేవారు .  ఆయన  రాష్ట్రపతి  భవన్   విడిచి   వెళ్ళేటపుడు   ఒక్క  పెన్సిల్  కూడా   వాటిలోనుండి    తనతో  తీసుకు వెళ్ళలేదు 
 
2.  2002 లో   రంజాన్   జూలై  ఆగస్ట్   నెలలో  కాబోసు  వచ్చింది  .    రాష్ట్రపతి   ఇఫ్తార్  విందు   ఇవ్వడం  ఆచారం   మన  దేశం  లో   .  ఒక  రోజు   కలాం  గారు   నన్ను  పిలిచి   ఇఫ్తార్  విందుకు   ఎంత   ఖర్చు  అవుతుంది  అని  అడిగారు   .   దాదాపు  22 లక్షలు  ఖర్చు  అవుతుంది   అని చెప్పాను   .  “  బాగా   స్తోమత  ఉన్నవారికి   విందు  ఇవ్వ్వడం కోసం   అంత  ఖర్చు  పెట్టడం   అనవుసరం  .  ఆ  సొమ్మును   పేదవారికి  బ్లాంకెట్లు  ,  బట్టలు ,  ఆహారం  ఇవ్వడం  కోసం  కేటాయించండి   అని    అనాదాశ్రమాలకు   ఇవ్వమని  చెప్పారు   .  అనాదాశ్రమాల   పేర్లు  ఎంపిక  చేసే  పని   కొందరికి  అప్పచెప్పారు   .  అందులో  ఆయన  ఎటువంటి  జోక్యమూ  చేసుకోలేదు  .   ఎంపిక  అయ్యాక  నన్నుతన  రూమ్  లోకి    పిలిచి  “   ఈ  లక్ష  రూపాయలూ   నా వ్యక్తిగత  సంపాదన   ,  నేను   ఇచ్చే   ఈ  సొమ్ము  విషయం  ఎవరికీ  చెప్పకండి “   అన్నారు   .    నేను  ఈ  విషయం  అందరికీ  చెబుతాను  అంటే   ఆయన  వద్దు  అన్నారు   .   తను   ఖర్చు  పెట్టదగిన  సొమ్ము   తన  సొమ్మూ   కూడా ఇలా  ఖర్చు  పెట్టిన   వ్యక్తి  ఇంకొకరు  లేరు  .   ఇఫ్తార్  పార్టీ   ఇవ్వని  నిఖార్సయిన ముస్లిం    రాష్ట్రపతి  అబ్దుల్  కలాం  !  


3.  ఆయనకీ   తన  మాటలకు  అందరూ    “ ఎస్  సర్  “ అనాలి   అనే   నైజం  లేదు  .  ఒక  రోజు   సుప్రీమ్  కోర్టు   ప్రధాన  న్యాయమూర్తి  గారితో    చర్చల  సందర్భంగా    ఏమంటావు  నాయర్   అని  నన్ను  అడిగారు  .  
“  నో  సర్  !  “  అన్నాను   .  ఆయన  మౌనంగా   ఉండిపోయారు  .  మీటింగ్  అయ్యాక   ప్రధాన   న్యాయ  మూర్తి  గారు   నన్ను  పిలిచి   అలా  అన్నారేమిటండి  అన్నారు   .   ఆయన  తరువాత   నన్ను  నా  అభిప్రాయం  చెప్పమని  అడుగుతారు   సర్   !   విని   అవుసరం  అయితే   తన  అభిప్రాయం  మార్చుకుంటారు   సర్  “  అన్నాను   .  ఆయన  ఆశ్చర్య  పోయారు  . 


4.    కలాం గారు  ఒక  సారి  తన బంధువులను  సుమారు  50  మందిని  రాష్ట్రపతి  భవన్   కు  అతిధులుగా   పిలిచారు  .  వారికి   ఢిల్లీ   చూపడానికి   ఒక  బస్సును  ఆయన  బుక్   చేయించారు   .  దానికి  అయిన  ఖర్చును  ఆయన  చెల్లించారు   .  ఒక్క  అధికారిక   వాహనం కూడా  ఆయన  వారికి  కేటాయించలేదు .  వారికోసం   అయిన  ఖర్చును  లెక్క  కట్టించారు   .  అది  సుమారు  రెండు   లక్షలు  అయ్యింది   .  ఆ  రెండు  లక్షలూ  ఆయన  చెల్లించారు   .   ఈ  దేశ  చరిత్రలో   ఇటువంటి  సంఘటన  ఇంతకు  ముందు  ఎప్పుడూ  జరగలేదు  .  ఆయన  అన్నయ్యను    ఒక  వారం  రోజులు  తనతో  పాటే  అట్టే పెట్టుకున్నారు  .  ఆ  రోజులకి   ఆయన  అద్దె  చేల్లిస్తాను  అంటే  మాత్రం   ఎవరూ  ఒప్పుకోలేదు  .  ఒక  రాష్ట్రపతి   తన  అన్నయ్యను  తనతో  పాటు   అట్టేపెట్టుకున్నందుకు  తన  నివాసానికి  తానే  అద్దె  చెల్లించాలి   అనే  నిజాయతీ   ని  మేము  భరించలేము   అని  మేము  ఒప్పుకోలేదు 


5.  ఆయన  రాష్ట్రపతి  భవన్   వదిలి   వెళ్లేముందు   అందరమూ  ఒక్కొక్కరుగా   కుటుంబాలతో  వెళ్లి  కలిశాము . అందరినీ   పేరు  పేరునా  పలకరించారు   . నా    భార్య  కాలు  విరిగినందువలన  నాతో  రాలేకపోయింది  .  ఆయన అడిగారు   నా  భార్య  ఎందుకు  రాలేదు   అని    చెప్పాను  . మర్నాడు   మా  ఇంటి  ముందు  పోలీస్  లు   .  ఏమిటి  హడావుడి   అని  అడిగితే   రాష్ట్రపతి  గారు   మా  ఇంటికి  వస్తున్నారు   అని  చెప్పారు   .
.ఇంత  వరకూ  ప్రపంచం లో   ఏ  దేశాధినేత   తన  వద్ద  పనిచేసే   ఒక  ఉద్యోగి   భార్య   కాలు  విరిగింది  అని  అతడి  ఇంటికి   వెళ్లి   ఆమెను   పరామర్శించడం  చరిత్రలో   ఎక్కడా  జరగలేదు . 


 6. చివరిగా   ఒక  టి వి   వారు  చెప్పిన  ఆయన  ఆస్తి  వివరాలు   :
1) 3  పేంట్లు
2) 6 షర్టులు
3) 3 సూట్లు 
4) 1 వాచ్ 
5) 2500 పుస్తకాలు 
6) Bangalore Flat handed over to scientists community long time ago
7) ఇంచుమించు   సున్నా   బ్యాంకు   బాలన్స్  
8) 120 మంది   కోట్ల   భారతీయుల   ప్రేమాభిమానాలు . 

మరింత సమాచారం తెలుసుకోండి: