అమెరికా లో  తెలుగుజాతికి అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగుసంఘం నాట్స్ .. మరోసారి  అమెరికాలో తెలుగువారికి భరోసా ఇచ్చే కార్యక్రమాన్ని చేసింది. రెండు నెలల క్రితం సెయింట్ లూయిస్ లో అగ్ని ప్రమాదంలో చాలామంది తెలుగువారు తమ ఆస్తులను నష్టపోవాల్సి వచ్చింది. ఆ అగ్ని ప్రమాదంలో  బాధితులను ఆదుకోవాలంటూ నాట్స్ పిలుపునిచ్చింది.


నాట్స్ సభ్యులు దీనిపై స్పందించి తమ వంతు చేయూత అందించారు. ఇలా సేకరించిన 7500 ల డాలర్ల మొత్తాన్ని బాధితులకు చెక్ రూపంలో అందించడం జరిగింది. నాట్స్ టీం వైఎస్ఆర్ కే ప్రసాద్, రమేశ్ బెల్లం, నాగశ్రీనివాస శిష్ట్ల ,రాజ్ ఓలేటి, రంగా సురేష్, వెంకట్ చింతాల ఈ చెక్కుల పంపిణి కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: