నారా చంద్ర బాబు నాయుడు చేస్తున్న అన్నీ రాజ్యాంగ విరుద్ధ అవినీతి, బందుప్రీతి, ప్రజావిద్రోహ కార్యక్రమాలకు ప్రత్యక్ష సాక్షులు పచ్చ మీడియా హౌజెస్ మౌన సాక్షి అయితే ఓకే, కాని ఆ దగాలకు, నేఱాలకు మద్దతు పలుకుతూ మీకు మేమున్నాం! అంటూ అండగా నిలవటం మాత్రం క్షమించరానిది మాత్రమే కాదు, దాన్ని మీడియా రాష్ట్రాలకు చేస్తున్న విద్రోహంగా చెపుతున్నారు సునిసిత విశ్లేషకులు.
పచ్చమీడియా తెలుగురాష్ట్రాలకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న ద్రొహం తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టిన తీరు ను ప్రతిబింబిస్తుంది. వీళ్ళను నమ్మి దశాబ్ధాలు గా తెలుగు ప్రజలు ఈ దుర్దిశలో రాజకీయాలు నడిపే రాజకీయ పార్టీని భుజస్కందాలు విరిగేలా. మోస్తున్నాయి.
అయితే కొన్ని మీడియా హౌజెస్ తో పాటు నేషనల్ మీడియా పాపాల పుట్టలను అప్పుడప్పుడూ పగలగొడుతూనే ఉన్నాయి.
చంద్ర బాబు వెళ్లింది ఐక్య రాజ్య సమితికి కాదు, ఆ ఎదురుగా ఉన్న పాన్-షాప్ కు అనే విషయాన్ని వెటకారంగానైనా కుండబద్దలు కొట్టిన వ్యక్తి ఉండవల్లి అరుణ కుమార్ అలాంటి అతి కొద్ది మందైనా జనాలకు నిజాలు చెప్పి మేలుకొలుపు తున్నారు. అంతేకాదు, యుఎన్ వరకు వెళ్లి ప్రకృతి సేద్యం పేరిట చంద్రబాబు చేసింది ప్రసంగం కాదని, 16వేల కోట్ల రూపాయల అతి భారీ కుంభకోణమనే విషయాన్ని కూడా బయట పెట్టారు.
ఇవి మాత్రమే కాకుండా, చంద్రబాబు చేపట్టిన పోలవరం ప్రాజెక్టుల్లో అవకతవకల్ని, పట్టిసీమ ఎత్తిపోతల్లో లొసుగుల్ని నిరంతరంగా బయటపెట్టింది కూడా ఉండవల్లే. ఇప్పుడీ వ్యక్తి చంద్రబాబుకు సంబంధించిన మరో పెద్ద కుంభకోణాన్ని వెలికితీసే పనిలో పరిశోధన చేస్తూ బిజీగా ఉన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి అతిభారీ కుంభకోణాన్ని ఉండవల్లి బయటకు తీయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పరిశోధన పూర్తిచేసి త్వరలోనే కుంభకోణ వివరాల్ని ప్రెస్-మీట్ పెట్టి బయటపెట్టబోతున్నారట.
ఇదేదో కమీషన్ పెంపు, నిర్మాణ వ్యయం సవరింపు, థర్డ్ పార్టీ కాంట్రాక్టుల అప్పగింత, గుత్తేదార్లకు అనవసర అడ్వాన్సుల పేమెంట్ లాంటివి వందల కోట్ల వ్యవహారం కాదట. ప్రజల వెన్ను లోని సారాన్ని పీల్చి పిప్పిచేసే వేల కోట్ల రూపాయల కుంభకోణంగా బయటకు రానుందని తెలుస్తోంది.
పోలవరంప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు సాగించిన అవినీతి హోమాన్నికార్యకలాపాల్నిఇప్పటికే కొంతవరకు బయటపెట్టిన ఉండవల్లి ఇప్పుడు బట్టబయలు చేయనున్న అంశాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించే అవకాశాలు పుష్కళంగా ఉన్నాయట. అభిఙ్జవర్గాల సమాచారం ప్రకారం ఆయన బయట పెట్టే తెలుగుదేశం అధినేత అక్రమ లావాదేవీల వ్యవహారాన్ని కేంద్రం కూడా సునిశితంగా అతి దగ్గరగా గమనిస్తోందట.
ఎందుకంటే చంద్రబాబు పాలనకు సంబంధించి పలు కుంభకోణాల్ని బయటపెట్టేందుకు బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించారు. ఉండవల్లి సేకరిస్తున్న సమాచారం వాళ్లకు మరింతగా పనికొచ్చేలాగా ఉందట. నిజానికి ఇలాంటి పనుల్ని ప్రాంతీయ మీడియా చేపట్టాల్సి ఉండగా, అది తన బాధ్యత ను వదిలేసి ప్రభుత్వానికి బాసటగా ఉండటమే కాదు బాకా ఊదుతుంది.
ప్రభుత్వం సాగిస్తున్న అవినీతి యఙ్జాన్ని ఎండగట్టటం మరచి పచ్చ మీడియా హౌజెస్ దురదృష్టవశాత్తూ చంద్రబాబుకు చంచాలుగా తొత్తులుగా మారాయని చెప్పొచ్చు. చంద్రబాబు చేయని మంచి పనులను చేసినట్టు చూపించి, దుర్మార్గాలను మాయతో మూసేసి ప్రజల దృష్టిలో నారాసురుణ్ని హీరోగా చేసే ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయ ని అంటున్నాయి ప్రతిపక్షాలు. అలాంటి మీడియాకు బాబు అవినీతి ఎలాకనిపిస్తుంది? అందుకే ఉండవల్లిలాంటి వ్యక్తులు, కొన్ని స్వచ్ఛందసంస్థలు కలిసి చంద్రబాబు చేసిన అక్రమాలు, అవినీతిని తవ్వి తీసేందుకు పూనుకున్నాయి.