జయాపజయాలు దైవాదీనాలు. కాని కొన్ని వ్యూహాలు మాత్రం జయాలకు దారి తీస్తాయి. వ్యూహాల దెబ్బకు కొన్ని పార్టీలు తెలంగాణాలో తమ అస్థిత్వం కోల్పోనున్నాయి. గతంలో టిడిపితో కలవటం వల్లే వామపక్షాలు ఆంధ్రప్రదేశ్ లో తమ అస్థిత్వాన్ని, చివరకు ఉనికిని కోల్పోయాయి. కొందరు ప్రసిద్ధ వ్యక్తులు, పార్టీలు కూడా ఇప్పుడు వారి కీర్తిని కోల్పొనున్నారు.  అలాగే టిడిపికి ఊడిగం చెసే పరిస్థితులు ఊహించవచ్చు. తాజాగా కర్ణాటకలో జెడిఎస్ కు కాంగ్రెస్ చేసే ఊడిగమే సీట్లసంఖ్య లేకపోయినా టిడిపి కాంగ్రెస్, తెలంగాణా జనసమితి, కమ్యూనిస్ట్ పార్టీ ఆ పనే చేయక తప్పదు.
mahakutami కోసం చిత్ర ఫలితం

ఈ ప్రయోగంలో మహాకూటమి గెలుపు సాధించినా దానిపై పెత్తనం చంద్రబాబు చేతిలోకి వెళ్తుంది. ఎందుకంటే ఆయన ₹ 500 కోట్ల రూపాయలతో కాంగ్రెస్ విజయాన్ని ముందుగానే కొనేశారు. ఎన్నికలై ఒకవేళ మహాకూటమి అధికారలోకి వస్తే ఖచ్చితంగా రెవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ అధికార కేంద్రంగా మహాకూటమి ప్రభుత్వం ఏర్పడ్డా, నేపధ్యంలో ఉండి శాసించేది మాత్రం చంద్రబాబు నాయుడే. అందుకే వారికి ప్రతిపక్షాల గెలుపు ముఖ్యం. 
mahakutami కోసం చిత్ర ఫలితం
ఆ ప్రాతిపదికనే సీట్ల సర్దుబాటు ఉండాలి. గెలవని సీట్ల కోసం పంతాలకు పోయి అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. సర్దుబాటు ధోరణి ముఖ్యం అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తెలంగాణ తెదేపా అధ్యక్షుడు ఎల్‌.రమణలకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు సూచించారు. తెలంగాణలో మహాకూటమి సీట్ల సర్దుబాటుకు సంబంధించి డిల్లీలో వీరు ముగ్గురూ శనివారం రాత్రి భేటీ అయ్యారు. 
mahakutami కోసం చిత్ర ఫలితం
రాత్రి గంటకు పైగా సమావేశం కొనసాగింది. నామినేషన్లకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో సీట్లపంపకాలను త్వరగా పూర్తిచేయాలని నేతలు నిర్ణయించారు. కాంగ్రెస్‌ 91, తెజస 8, తెదేపా 15, సీపీఐ 5 సీట్లలో పోటీచేయాలని అంగీకారానికి వచ్చినట్లు తెలిసింది. 
mahakutami కోసం చిత్ర ఫలితం
ఎవరెవరు ఏ ఏ సీట్లలో పోటీ చేయాలనే అంశంపై స్పష్టత రాలేదని సమాచారం. శుక్రవారం అర్థరాత్రి హైదరాబాద్‌ లో ఉత్తమ్‌, కోదండరాం, రమణల మధ్య జరిగిన చర్చ ల కొనసాగింపుగానే శనివారం డిల్లీలో చంద్రబాబుతో భేటీ జరిగినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో తెదేపా గెలిచి, 2009ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన ఎల్‌.బి.నగర్‌, జూబ్లీహిల్స్‌, కుత్బుల్లాపూర్‌ వంటి సీట్లే ప్రధాన సమస్యగా మారినట్లు తెలిసింది. 
mahakutami కోసం చిత్ర ఫలితం
తెజస, సీపీఐ సైతం కాంగ్రెస్‌, తెదేపాలు బలంగా కోరుతున్న కొన్ని సీట్లపై పట్టువీడకపోవడం ప్రతిష్టంభనకు దారితీస్తున్నట్లు తెలిసింది. పార్టీబలం, అక్కడ ఆపార్టీకి ఉన్న అభ్యర్థి విజయా వకాశాలను పరిగణనలోకి తీసుకోవాలని చంద్రబాబు నేతలకు సూచించినట్లు సమాచారం. అవసరమైతే త్యాగాలు చేయకతప్పదని చెప్పినట్లు తెలిసింది.
mahakutami కోసం చిత్ర ఫలితం
చంద్రబాబును ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కలవడానికి ముందు గానే సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, డి.రాజా, నారాయణ, తెదేపా అధినేతతో భేటీ అయ్యారు. వారితో కలిసి చంద్రబాబు రాత్రి భోజనం చేశారు. దేశ రాజకీయాలు, ఏపీలో పరిస్థితులే ఎక్కువగా వారి మధ్య చర్చకు వచ్చినట్లు తెలిసింది. తెలంగాణలోనూ సీట్ల సర్దుబాటును వెంటనే పూర్తి చేస్తే మేలని సీపీఐ నేతలు సూచించినట్లు తెలిసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: