భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా ఇంట ఆనందాల వేడుకలు జరుగుతున్నాయి. భారత దేశానికి చెందిన సానియా మిర్జా పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ ప్రేమించి సాంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకున్నారు. తాజాగా షోయబ్ మాలిక్, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా దంపతులు తల్లిదండ్రులయ్యారు. ప్రస్తుతం దుబాయ్ లో ఉంటున్న సానియా ఈ రోజు ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని భర్త షోయబ్ మాలిక్ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నాడు. కాగా, తనకు కొడుకు పుట్టిన సందర్భంగా షోయబ్ మాలిక్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఈ సందర్భంగా షోయబ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. ‘ఈ శుభవార్తను మీతో పంచుకోవడం ఎంతో ఉద్వేగభరితంగా ఉంది. పిల్లాడు, నా శ్రీమతి.. ఆరోగ్యంగా ఉన్నారు. నా శ్రీమతి ఎప్పటిలాగా స్ట్రాంగ్ గా ఉంది. మీ ప్రేమ, ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశాడు.
తాజాగా బాలీవుడ్ దర్శకురాలు, కొరియో గ్రాఫర్ ఫరాఖాన్ స్పందిస్తూ ‘చాలా రోజుల తర్వాత శుభవార్త విన్నాను. సానియా- షోయబ్ మాలిక్ దంపతులకు అభినందనలు. అమ్మమ్మ తాతయ్యలుగా మారిన ఆనమ్-ఇమ్రాన్ మీర్జాలకు కూడా.
ఆ దేవుడు మన బుల్లి రాకుమారుడిని దీవిస్తాడు’ అని ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా సానియా అభిమానులు, కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, సినీ సెలబ్రెటీలు షోయబ్ మాలిక్,స్టార్ సానియా మిర్జా దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.