ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక్కటే చర్చ..ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పై హత్యా యత్నం.  అయితే ఇది చిలికి చిలికి గాలి వానగా మారి కేంద్రం వర్సెస్ రాష్ట్రం మద్య కూడా వైరం పెంచుతుంది.  ఓ పక్క అధికార పార్టీ వారు జగన్ పై హత్య చేసిన విషయంలో నింధితుడిని ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా విచారణ జరిపిస్తామంటుంటే..మరోపక్క వైసీపీ నేతలు అధికార ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి..బూటకపు సాక్ష్యాలు సృష్టిస్తుందని..కేసును పక్కదోవ పట్టిస్తున్నారని..అధికార పార్టీకి అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తుంది. 
Image result for జగన్ ఇద్దరు యువతుల అరెస్ట్
ప్రస్తుతం జగన్ పై హత్యాయత్నం కేసు సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  గత వారంలో విశాఖ ఎయిర్ పోర్టులో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై శ్రీనివాసరావు యువకులు పందెం కోళ్లకు వాడే కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. కేసు విచారణ, నెమ్మదిగా సాగుతూ, రోజుకో కొత్త విషయాన్ని వెలుగులోకి తెస్తోంది. తాజాగా, ఈ కేసులో సంబంధముందన్న అనుమానంతో పోలీసులు ఇద్దరు యువతులను అరెస్ట్ చేశారు. విశాఖ నుంచి గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు వచ్చిన సిట్ బృందం, వీరిని అదుపులోకి తీసుకుని విశాఖకు తరలించింది.
Image result for JAGAN SRINIVSA
జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావు జనవరిలోనే కత్తి తీసుకొచ్చి వంటగదిలో ఉంచాడని విశాఖ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ చంద్ర లడ్డా తెలిపారు. జగన్‌ ఈ నెల 25నే ఎయిర్‌పోర్ట్‌కు వస్తారని ముందే తెలుసుకున్న శ్రీనివాస్.. కత్తులు ఎయిర్‌పోర్టులోకి తీసుకొచ్చి సీసీ కెమెరాలు కవర్‌ చేయని ప్రాంతంలో దాచినట్లు విచారణలో వెల్లడైనట్టు తెలిపారు. 
Image result for ys jagana injury
అయితే హత్యకు ముందు శ్రీనివాస్ తన స్నేహితులకు పార్టీ ఇచ్చారని..యువతులతో గడిపాడని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన అమ్మాయిలు వీరేనా? అన్న విషయం తెలియరాలేదు. వీరిలో ఒకరు శ్రీనివాసరావు తన స్నేహితులకు పార్టీ ఇచ్చిన సమయంలో వచ్చిన యువతిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ అమ్మాయితో పలు మార్లు శ్రీనివాస్ మాట్లాడాడని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: