సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కి ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ తరుపున రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే సీటును బండ్ల గణేశ్ కోరినట్లు వార్తలు వచ్చాయి. కానీ మహాకూటమి నేపథ్యంలో సీట్ల సర్థుబాటులో బండ్ల గణేష్ కి ఎమ్మెల్యే గా పోటీ చేసే ఛాన్స్ లేకుండా పోయింది.
దీంతో గణేశ్ ఆశలన్నీ అడియాశలయ్యాయి. అయితే తాజాగా కాంగ్రెస్ పార్టీ బండ్ల గణేశ్ కు శుభవార్త తెలిపింది. దాంతో బండ్ల నిరాశ పడకుండా ఆయనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.
ప్రముఖ నిర్మాత బీఏ రాజు ఈ విషయాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ‘బండ్ల గణేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు’ అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ఈ సందర్భంగా గణేశ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.