ప్రపంచంలో దేవుడిని ఎంత భక్తితో పూజిస్తారో దెయ్యానికి అంతే భయపడతారు. అయితే భారత దేశంలో తాంత్రిక శక్తులు ఉన్నాయని..మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరుస్తామని..ఎంతో మంది దొంగబాబలు అమాయకులను మోసం చేస్తుంటారు. మరికొంత మంది మూఢవిశ్వాలు భాగా నమ్ముతూ..చనిపోయిన వారిని బతికించుకోవడానికి తాంత్రిక పూజలు కూడా చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో బయట పడ్డాయి. తాజాగా ఓ యువకుడు చేసిన నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
తండ్రి చనిపోవడాన్ని తట్టుకోలేకపోయిన ఓ వ్యక్తి ఆయన్ను మళ్లీ బతికించాలనుకున్నాడు. క్షుద్ర పూజల ద్వారా తండ్రి బతుకుతాడని నమ్మిన అతను శవాన్ని కుళ్లిపోకుండా భద్రపరిచి పూజలు చేయడం మొదలుపెట్టాడు. అదీ కూడా ఒకరోజూ..రెండు రోజులు కాదు..ఏకంగా ఆరు నెలలు తన తండ్రి బతికించుకోవడానికి పూజలు చేశాడు. ఈ ఘటన జార్ఖండ్ లోని మకత్ పూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..ఇందిరాకాలనీలో ఉంటున్న విశ్వనాథ్ ప్రసాద్(75) అనారోగ్యంతో ఈ ఏడాది మే నెలలో కన్నుమూశారు. దీంతో ఆయన కుమారుడు ప్రశాంత్ కుమార్ తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేందుకు నిరాకరించాడు.
అంతే కాదు తన తండ్రిని ఎలాగైనా బతికిస్తానని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చాడు..ఇందుకు అనుకూలంగా శవాన్ని కుళ్లిపోకుండా ప్రత్యేక రసాయనాలు పూసి ఐస్ లో భద్రపరిచాడు. గత ఆరు నెలలుగా శవం ముందు కూర్చుని పూజలు చేస్తూనే ఉండేవాడు. అయితే ప్రశాంత్ చేస్తున్న పనికి విసిగిపోయిన తల్లి, చెల్లి ప్రశాంత్ పై దాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో అరుపులు వినిపించడంతో స్థానికులు భయపడి వెంటనే పోలీసులకు సమాచారం తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రశాంత్ ఇంటిపై దాడి చేయడంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విశ్వనాథ్ అంత్యక్రియల ఏర్పాట్లు చేశారు. కాగా, ప్రశాంత్ కుమార్ ని కోర్టు ముందు ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలించారు