చంద్రబాబు నాపై దాడి చేయిస్తారు.. కుదిరితే నన్ను హత్య చేయిస్తారు.. నాకు ఏమైనా జరిగితే అందుకు పూర్తి బాధ్యత చంద్రబాబుదే. నాకు ప్రాణహాని జరిగితే అందుకు కారణం చంద్రబాబు మాత్రమే... ఈ ఆరోపణలన్నీ ఓ పార్టీ అధ్యక్షుడివి. ఆ పార్టీ ప్రజాశాంతి పార్టీ.. ప్రజాశాంతా.. అదేంపార్టీ ఎప్పుడూ విన్నట్టు లేదే అనుకుంటన్నారా..?

Image result for KA PAUL


క్రైస్తవ మత బోధకుడు కే ఏ పాల్ గత ఎన్నికల సమయంలో స్థాపించిన పార్టీ ఇది. మళ్లీ ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడే సరికి ఆయన తెరపైకి వచ్చారు. మొన్నటికి మొన్న సీఎంను చేస్తానంటూ పవన్ కల్యాణ్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. తన ప్రజాశాంతి పార్టీ వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేస్తుందని చెబుతున్నారు.



గతంలో తన ఆశీస్సుల కోసం 22 సార్లు తన వద్దకు సీఎం చంద్రబాబు వచ్చారని.. బిల్ క్లింటన్ వంటి వారిని తానే చంద్రబాబుకు పరిచయం చేశానని.. పలువురు విదేశీ పారిశ్రామిక వేత్తలను ఆయనకు ఇంట్రడ్యూస్ చేశానని ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు తన పార్టీకి ఉన్న ప్రజాదరణ చూసి తనను చంపించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికీ చంద్రబాబు పట్ల తనకు అభిమానం ఉందని కూడా పాల్ చెప్పుకొచ్చారు.



ఈనెల 8 న భీమవరంలో ప్రజాశాంతి సభ నిర్వహిస్తున్నానని.. కానీ సీఎం దానికి అవసరమైన అనుమతులు ఇవ్వకుండా వేధిస్తున్నారని పాల్ ఆరోపించారు. తాను కాపు వర్గానికి చెందిన వాడినని.. తన భార్య దళితురాలను.. తనకు సమాజంలో 70 శాతంపైగా మద్దతు ఉందని.. తన పార్టీ సులభంగా అధికారంలోకి వస్తుందని పాల్ అంటున్నారు. పనిలో పనిగా తెలంగాణ ఎన్నికలపైనా జోస్యం చెప్పారు. ఇక్కడ ఎక్కువగా ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలుస్తారని.. ఏ పార్టీకీ మెజారిటీ రాదని పాల్ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: