కేసీఆర్ అంటే తెలంగాణ ఐకాన్.. ఆయనంటే ప్రాణం తీసుకునే వీరి తెలంగాణవాదులెందరో ఉన్నారు. అందులో విశేషం ఏమీ లేదు. కానీ కేసీఆర్ అంటే ప్రాణమిచ్చేంత అభిమానం ఓ ఆంధ్రా యువకుడికి ఉందంటే ఆశ్చర్యమే కదా. అంతే కాదు. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని కోరుతూ ఆ కుర్రాడు ఏకంగా నాలుక కోసం దేవుడి హుండీలో ముడుపుగా వేసేశాడు.


హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఈ ఘటన జరిగింది. ఆ యువకుడి పేరు చేవెళ్ల మహేశ్.. అతని స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం గుడిల. బంధువుల ఇంటికి హైదరాబాద్ వచ్చిన మహేశ్.. కేసీఆర్ విజయం కోసం ఇక్కడ పలు దేవాలయాల్లో పూజలు చేశాడు. చివరకు శ్రీనగర్‌ కాలనీలోని హనుమాన్‌ దేవాలయంలో నాలుక కోసుకుని హుండీలో వేశాడు.


మహేశ్ నాలుక కోసుకోవడాన్ని గమనించిన ఆలయ సిబ్బంది అతడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కేసీఆర్ సీఎం కావాలనే ఈ మొక్కు చెల్లిస్తున్నట్టు మహేశ్ తన వద్ద ఓ లేఖ రాసి పెట్టుకున్నాడు. తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రాలో జగన్ సీఎం కావాలని మహేశ్ కోరుకున్నాడు.

Image result for ktr andhra fan

వైఎస్ సీఎం కావాలని గతంలో కూడా మహేశ్ ఇలాంటి ప్రయత్నమే చేశాడట. ఇటీవల ఓ ఆంధ్రా యువకుడు టీఆర్ఎస్ పై అభిమానంతో వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి వచ్చి కేటీఆర్ ను కలుసుకున్న సంగతి కూడా తెలిసిందే. అభిమానానికి ప్రాంతీయ బేధం లేదన్నమాట.


మరింత సమాచారం తెలుసుకోండి: