కారు జోరుకు హస్తం బేజారవుతోంది. ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు కూడా గుండెలు చిక్కబట్టుకుని టీవీలకు అతుక్కుపోతున్నారు. దాదాపు చాలా మంది కాంగ్రెస్ అగ్రనేతలు ఓటమి బాటలో ఉండటం విశేషం.

కాంగ్రెస్ అగ్రనేతలుగా పేరున్న జానారెడ్డి నాగార్జునసాగర్ లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో వెనుకంజలో ఉన్నారు. ఆందోల్ లో కాంగ్రెస్ నేత దామోదర్ నరసింహా కూడా యువ నాయకుడు క్రాంతి చేతిలో వెనుకంజలో ఉన్నారు.

అలాగే కాంగ్రెస్ సీనియర్ నేతలు గీతారెడ్డి, షబ్బీర్అలీ, జీవన్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు కూడా ఓటమి బాటలో ఉండటం విశేషమే. మహా కూటమి గట్టి పోటీ ఇస్తుందని అంతా భావించినా అంచనాలు తలకిందులయ్యాయి.

వీరితో పాటు కూటమిలో మరో నేత సీపీఐ నేత చాడా వెంకటరెడ్డి కూడా వెనుకంజలో ఉన్నారు. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ కూడా ముషీరాబాద్ లో వెనుకంజలో ఉన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: