మహబూబ్నగర్ జిల్లాలో కారు టాప్ గేరులో దూసుకుపోతోంది. ఇక్కడ దాదాపు అన్ని స్థానాల్లోనూ గులాబీ నేతలే ముందంజలో ఉన్నారు.
ప్రత్యేకంగా ఇక్కడ సీఎం కేసీఆర్ తో ఢీ అంటే ఢీ అన్న కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి కొడంగల్ లో ఎదురుగాలి వీస్తోంది. అక్కడి టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో వెనుకంజలో ఉన్నారు.
గద్వాలలో కాంగ్రెస్ నేత డీకే అరుణ కూడా ఓటమి బాటలో ఉన్నారు.