మద్దెలచెరువు సూరి హత్య కేసు విచారణ పూర్తయింది. త్వరలో తీర్పు వెలువడబోతోంది. ఈ నేపథ్యంలో మరోసారి ఫ్యాక్షన్ హత్య కేసు వార్తల్లోకి వస్తోంది. రాయలసీమ ఫ్యాక్షనిజానికి నిలువెత్తు సాక్ష్యంగా ఈ హత్య కేసు నిలిచిపోతుంది. పరిటాల – మద్దెలచెరువు కుటుంబాల మధ్య ప్రతీకార హత్యలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

క్రికెట్లో సూరి ఆల్ రౌండర్


పరిటాల రవిని మద్దెల చెరువు సూరి మొద్దు శీను ద్వారా చంపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మద్దెల చెరువు సూరి హైదరాబాద్ లో హత్య చేయబడ్డాడు. ఆ కేసులో భానుకిరణ్ అనే వ్యక్తిని నిందితుడుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Image result for మద్దెలచెరువు సూరి హత్య


కేసు విచారణ, కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. ఇక తీర్పే మిగిలింది. ఈ సమయంలో మద్దెలచెరువు సూరి భార్య భానుమతి పరిటాల కుటుంబంపై ఆరోపణలు చేశారు. సూరి హత్య వెనుక పరిటాల సునీత హస్తం ఉందని భానుమతి ఆరోపిస్తున్నారు.

Related image


పరిటాల కుటుంబం అండ లేకపోతే భానుకిరణ్‌ ఇంతటి దారుణానికి పాల్పడేవాడు కాదని అన్నారు. భానుకిరణ్ సూరి పేరు చెప్పి 700 కోట్ల రూపాయలు సెటిల్‌మెంట్లు చేశాడని భానుమతి ఆరోపించారు. భానుకిరణ్‌కు ఉరిశిక్ష లేదా జీవిత ఖైదు విధించాలని భానుమతి హైకోర్టును కోరారు. హైకోర్టులో న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు భానుమతి.


మరింత సమాచారం తెలుసుకోండి: