వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు ఎన్ని ఎదురు దెబ్బ‌లు త‌గిలినా.. పాఠాలు నేర్చుకోవ‌డం లేదు. మ‌ళ్లీ మ‌ళ్లీ చేసిన త‌ప్పులే చేస్తున్నారు. ఇప్ప‌టికే ఒకసారి బ‌డాయికి పోయి. టీడీపీని కెలికి.. హైటెన్ష‌న్ తెచ్చుకున్నాడు. అయినా ఆయ‌న మార‌డం లేదు. గ‌తంలోఅంటే రెండేళ్ల కింద‌ట గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసేందుకు వెళ్లిన జ‌గ‌న్ బృందం అక్క‌డే మీడియాతో మాట్లాడుతూ.. ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశాడు. త‌మ‌కు ట‌చ్‌లో దాదాపు 15 నుంచి 20 మంది టీడీపీ ఎమ్మెల్యేలు ట‌చ్‌లో ఉన్నార‌ని, వారంతా తాము ఊ! అంటే పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నార‌ని వ్యాఖ్యానించాడు. 


అయితే, దీని ప‌ర్య‌వ‌సానం ఆయ‌న ఊహించిన‌ట్టుగా టీడీపీ నేత‌లంతా.. వైసీపీలోకి వ‌చ్చేసి చంద్ర‌బాబు ప్ర‌భుత్వం ప‌డిపోతే.. తాను ప్ర‌భుత్వం ఏర్పాటు చేయొచ్చ‌ని జ‌గ‌న్ భావించాడు. కానీ, ఇక్క‌డ తీవ్ర‌స్థాయిలో ఈ వ్యాఖ్యలు రివ‌ర్స్ రిజ‌ల్ట్ ఇచ్చాయి. అప్ప‌టి వ‌ర‌కు ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌పై దృష్టి పెట్ట‌ని చంద్ర‌బాబు.. ఒక్క‌సారిగా జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌తో త‌న వ్యూహాల‌కు ప‌దును పెంచుకున్నారు. ఆ వెంట‌నే ఒక్క‌రొక్క‌రుగా వైసీపీ ఎమ్మెల్యేల‌ను త‌న పార్టీలోకి లాగేసుకున్నారు. ఈ ప‌రంప‌ర దాదాపు ఒక‌రిద్ద‌రు త‌క్కువ‌గా పాతిక మంది వైసీపీ నేత‌లు టీడీపీ సైకిల్ ఎక్కేలా చేసింది. దీంతో జ‌గ‌న్ కు నిద్ర‌కూడా ప‌ట్ట‌లేదు. ఎప్పుడు ఎవ‌రు త‌న‌కు హ్యాండిస్తారో తెలియ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. 


ఈ షాక్ నుంచి కోలుకునేందుకు ఏడాదికి పైగా స‌మ‌యం ప‌ట్టింది. ఈ దెబ్బ‌తోనే ఏకంగా ఆయ‌న అసెంబ్లీ గ‌డ‌ప కూడా తొక్క‌కుండా పాద‌యాత్ర బాట‌ప‌ట్టాడు. మ‌రి అలాంటి షాక్ ను మ‌రిచిపోయాడో.. లేక బాబును మ‌రింత రెచ్చ‌గొట్టాల‌ని అనుకున్నాడో తెలియ‌దు. తాజాగా.. మ‌ళ్లీ టీడీపీ నేత‌ల‌ను త‌న పార్టీలోకి చేర్చుకునేందుకు జ‌గ‌న్ ఇప్పుడు ఏకంగా ఆప‌రేష‌న్‌-విజ‌య్‌ను స్టార్ట్ చేశాడు. ఈ క్ర‌మంలో టీడీపీకి ప‌ట్టున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో నేత‌ల‌కు గేలం వేసేందుకు వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయి రెడ్డి రంగంలోకి దిగి.. టీడీపీ నేత‌ల‌కు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌లే ప్ర‌కాశం నేత అన్నారాంబాబు ను చేర్చుకున్నారు. అయినా కూడా తీర‌ని దాహంతో మ‌రింత మందిని త‌న పార్టీలో చేర్చుకునేందుకు జ‌గ‌న్ ప్ర‌య‌త్నిస్తున్నారు.


ఒక ర‌కంగా ఎన్నిక‌ల ముందు మ‌రోసారి ఆయ‌న టీడీపీని కెలుకుతున్నాడ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం ఈ ప‌రిణామాల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న చంద్ర‌బాబు.. తీవ్ర‌స్తాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. వైసీపీని నామ‌రూపాలు చేసే ప్లాన్ ఏదో చేస్తున్న‌ట్టు అమ‌రావ‌తి వ‌ర్గాలు సైతం చెబుతున్నారు మ‌రి ఇదే జ‌రిగితే.. ఎన్నిక‌ల ముంగిట‌.. వైసీపీ తీవ్ర ఇబ్బందులు ప‌డ‌డం ఖాయంగా ఉంది. మ‌రి జ‌గ‌న్ ప‌రిస్థితి ఏమ‌వుతుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: