రోడ్డు ప్రమాదంలో గాయపడి దివ్యాంగుడిగా మారి 12 ఏండ్లుగా మంచానికే పరిమితమైన వ్యక్తికి సీఎం కేసీఆర్ మనుమడు హిమాన్షు చేయూతనందించారు. వివరాలు ఇలా.. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. భద్రాది కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని రాజీవ్నగర్లో నివాసముంటున్న నూకసాని శ్రీనివాసరావు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. ఈ క్రమంలో వెన్నుపూస గాయం మరింత పెరిగి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు.
నూకసాని శ్రీనివాసరావు పరిస్థితి చూసిన కేసీఆర్ మనవడు హిమాన్షు చలించిపోయారు. శ్రీనివాసరావు చిరునామాను గుర్తించి వెంటనే అతణ్ణి భద్రాచలం ప్రభుత్వ దవాఖానకు తరలించి వైద్యమందించేలా ఏర్పాట్లు చేశారు. అవసరమైతే హైదరాబాద్కు తరలించి మెరుగైన వైద్యం అందేలా సాయపడతానని హామీ ఇచ్చి ఆ కుటుంబంలో ఎంతో ధైర్యాన్ని నింపారు. తాజాగా హిమాన్షు స్వయంగా స్పందించి చికిత్స చేయిస్తున్న దివ్యాంగుడు నూకసాని శ్రీనివాసరావు మరణించాడు.
మెరుగైన వైద్య చికిత్స కోసం శ్రీనివాసరావును హైదరాబాద్ తరలించాలని సిఫార్సు చేసిన వైద్యులు, ఆ ప్రయత్నాల్లో ఉండగానే అతని ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఈ క్రమంలో ఆదివారం రాత్రి శ్రీనివాసరావు మరణించాడు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. శ్రీనివాసరావుకు భార్య, ఇరువురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.