చేసింది ప్రచారం చేసుకోవడంలో ఏపీ సీఎం చంద్రబాబును మించినవారు కనిపించరుచేసినదానితో పాటు చేయని దాన్ని కూడా ఆయన ప్రచారం చేసుకుంటారని ప్రత్యర్థులు విమర్శిస్తుంటారు. ఇప్పుడు ఆయన కుమారుడు లోకేశ్ తీరు ఇంకో అడుగు ముందుకేసినట్టు కనిపిస్తోంది.

Image result for NARA LOKESH TV ADDS


సాధారణంగా ప్రభుత్వం తాను చేసిన అభివృద్ధిని ప్రకటనల ద్వారా మీడియాలో ప్రచారం చేసుకుంటుంది. ఇది ముఖ్యమంత్రి పేరుపై జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు సంబంధిత మంత్రి ఫోటోలు కూడా ఈ ప్రకటనల్లో వాడుతుంటారు. కానీ ఏపీలో సీఎం కుమారుడు మంత్రి లోకేశ్ ప్రకటనలు విచిత్రంగా ఉంటున్నాయి.

startups in vizag


లోకేశ్ తన శాఖల్లో జరిగిన అభివృద్ధిని నేరుగా తన ఫోటోలతోనే ప్రభుత్వం తరపున ప్రచారం చేసుకుంటున్నారు. ఓ మంత్రి నేరుగా సీఎం ఫోటోలు లేకుండా ప్రకటనలు ఇవ్వడం చాలా అరుదు. సీఎం కుమారుడు కావడం వల్లనో.. ఏమో లోకేశ్ తన శాఖల్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రకటనలు ఇస్తున్నారుఐతే.. ఈ ప్రకటనలు చూస్తే క్యాబినెట్లో మిగిలిన అందరు మంత్రులూ ఫెయిలయ్యారా.. ఒక్క లోకేశ్ మాత్రమే అభివృద్ధి చేస్తున్నారా అన్న అనుమానాలు జనంలో కలిగే అవకాశం ఉంది.

Related image


అందరి కంటే వెనక మంత్రి పదవి చేపట్టి.. అందరూ ఆశ్చర్యపోయేలా సీనియర్లను కూడా లోకేష్ దాటిపోయారా? అని జనం ఆలోచించకమానరు. మరి మంత్రి వర్గంలో కేవలం ఒక్క మంత్రి మాత్రమే పని చేస్తే మరి ఆ ప్రభుత్వం గురించి జనం ఏం ఆలోచిస్తారో.. ఇది నెగిటివ్ ప్రచారానికి దారి తీస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: