కొందరు ఫైర్ బ్రండులు ఉంటారు. వాళ్ళు సిద్ధాంతబద్ధులై ఉంటారు కూడా! అలాంటి వరిఒల గోషామహల్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన బీజేపీ నేత రాజాసింగ్ ఒకరు. తన మాటే నెగ్గించు కోవటంలో ఆయన తరవాతే ఎవరైనా.  ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ ఖాన్  ముందు ప్రమాణ స్వీకారం చేయను అని ప్రకటించి సంచలనం సృష్టించిన రాజాసింగ్, నూతన సభాపతి గా పోచారం శ్రీనివాసరెడ్డి ఎంపికయిన అనంతరం నేడు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ పోచారం రాజాసింగ్ చేత శాసనసభ సభ్యుడిగా ప్రమాణం చేయించారు. రాజాసింగ్ హిందీలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు.
Image result for raja singh mla images Vs Mumtaz khan
మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే రాజాసింగ్ మీడియాతో మాట్లాడుతూ ధర్మం పట్ల-దేశం పట్ల నమ్మకం లేని ఎంఐఎం నేత ప్రొటెం స్పీకర్ గా ఉన్నందున ప్రమాణ స్వీకారం చేయను అని చెప్పానని గుర్తు చేశారు. భారత్ మాతకి జై అనడానికి సిగ్గుపడేవారు ప్రొటెం స్పీకర్ గా ఉంటే ఎలా ప్రమాణ స్వీకారం చెయ్యాలి? అని రాజాసింగ్ ప్రశ్నించారు. 15 నిమిషాలు సమయం ఇస్తే 100 కోట్ల హిందువులను చంపేస్తాం! అని అన్న వ్యక్తులు ఎంఐఎం పార్టీ నేతలు.  హిందువులను గౌరవించని వ్యక్తుల పార్టీ ఎం ఐ ఎం. 
Image result for raja singh mla images Vs Mumtaz khan
బంగారు తెలంగాణ నిర్మించాలంటే కేసీఆర్ మా అందరి మనోభావాలను పరిగణన లోకి తీసుకోవాలి. అలా వ్యక్తులకు విలువ ఇవ్వని పార్టీ నేత ముందు ప్రమాణ స్వీకారం చేయలేను అని వెల్ల డించారు.  తెలంగాణ సీఎం కేసీఆర్ గతం లో చాలా అభివృద్ధి చేశారని రాజాసింగ్ తెలిపారు. అయితే మరింత అభివృద్ధి చేయాలంటే ప్రజల మనోభావాలు గమనించాలని ఆయన కోరారు. నేను తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు దీన్ని కేసీఆర్ పరిశీలనలోకి తీసుకోవాలి అని రాజాసింగ్ సూచించారు.

Image result for raja singh mla images Vs Mumtaz khan

మరింత సమాచారం తెలుసుకోండి: