ఆయన వయస్సు 94 సంవత్సరాలు.. ఆ వయస్సులో ఎవరైనా మరొకరి సాయం లేకుండా పడక కుర్చీ నుంచి లేవడమే కష్టం. కానీ.. ఆయన రూటే సెపరేటు.. 94 ఏళ్ల వయస్సులోనూ చురుకుగా వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపిస్తున్నారు. పలువురు పారిశ్రామిక వేత్తలకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంతకూ ఆయన ఎవరో చెప్పలేదు కదూ.. తాజాగా పద్మభూషణ్ కు ఎంపికైన మహాశయ్ ధరంపల్ గులాటీ. ప్రముఖ మసాలా సంస్థ ఎండీహెచ్ వ్యవస్థాపకుడు. 1911లో గులాటీ ఈ సంస్థను స్థాపించారు. ఆ తర్వాత మరో 15 ఫ్యాక్టరీలకు విస్తరించారు.
94 ఏళ్ల వయస్సులోనూ తన రంగంలోని కుర్రాళ్లతో పోటీ పడుతున్నారు. వారిని వెనక్కునెట్టి అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యధిక వేతనం అందుకుంటున్న సీఈవోగా రికార్డు సృష్టించారు.
2017 సంవత్సరానికి గులాటీ... ఎఫ్ఎంసీజీ సీఈవోగా అందుకున్న జీతం ఎంతో తెలుసా.. అక్షరాలా 21 కోట్లు. అందుకేనేమో శ్రీశ్రీ ఏనాడో చెప్పారు.. కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు.. కొంతమంది కుర్రవాళ్లు ముందుతరం దూతలు.. ఈ రెండో కోవకు చెందుతారు మన గులాటీ.