వచ్చే ఎన్నికల్లో జనం చంద్రబాబును గెలిపించకపోతే అమరావతి రాజధాని వెనక్కు వెళ్లిపోతుందా.. జగన్ సీఎం అయితే రాజధానిని అమరావతి నుంచి వేరే ప్రాంతానికి తరలిస్తారా.. గతంలో ఉన్న ఈ అనుమానాలకు ఇప్పుడు టీడీపీ మంత్రి ఒకరు ఆజ్యం పోశారు.



చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి కాకపోతే రాజధాని వేరే ప్రాంతానికి వెళ్లిపోతుందని మార్కెటింగ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని పరిధిలోని తుళ్లూరులో ఎన్టీఆర్ స్వగృహ క్రింద ఇళ్లు కేటాయింపు కార్యక్రమంలో ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధాని నిర్మాణంలో అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు ఓటేయకపోతే చరిత్ర క్షమించదన్నారు ప్రత్తిపాటి.



ఐతే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యాఖ్యలను వైసీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి. రాజధాని పేరిట వైసీపీపై విష ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అమరావతికి జగన్ వ్యతిరేకమంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయిస్తున్నారని వారు అంటున్నారు.

amaravti కోసం చిత్ర ఫలితం


వాస్తవానికి రాజధాని ఎక్కడ పెడుతున్నారనే విషయాన్ని వైసీపీకి సీఎం చెప్పలేదని.. అయినా తాము అమరావతికి మద్దతు ఇచ్చామని గుర్తు చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువేదికలపై తమ నేత చెప్పినా టీడీపీ విష ప్రచారం చేస్తోందని వారు మండిపడుతున్నారు. ఇక ఇప్పుడు మంత్రులు సైతం అవే అబద్దాలు వల్లె వేస్తున్నారని వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: