రాజకీయాల్లో అనుకోకుండా సంచలనాలు జరుగుతుంటాయి. అలాంటిదే ఇది కూడా.. కే ఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరుపున మొదటి అభ్యర్థినిగా సీనియర్ జర్నలిస్ట్, యాంకర్ శ్వేతారెడ్డి పోటీకి దిగుతున్నారు. ఓ ప్రెస్ మీట్లో కే ఏ పాల్ ను యథాలాపంగా అడిగిన ఓ ప్రశ్నఆమెను హిందూపురం అభ్యర్థిని చేసింది.

Image result for ప్రజాశాంతి పార్టీలో యాంకర్


మీరు అభ్యర్థులకు టిక్కెట్లు ఇవ్వడానికి మీకు ఎన్ని కోట్లు తీసుకుంటారు.. నేను మీ పార్టీలోకి వస్తే నాకు టిక్కెట్ ఇవ్వడానికి ఎంత సొమ్ము ఇవ్వాలి అడిగేశారు శ్వేతారెడ్డి. దీంతో అబ్బే అలాంటిదేమీ లేదు. నేను ఎవరి దగ్గరా డబ్బు తీసుకోను.. కావాలంటే మీరు పోటీ చేస్తానంటే హిందూపురం టిక్కెట్ మీకే ఇచ్చేస్తానన్నారు.

Image result for ప్రజాశాంతి పార్టీలో యాంకర్


అలా అనడమే కాదు.. ఆ ప్రెస్ మీట్లోనే మా ప్రజాశాంతి పార్టీ అభ్యర్థి శ్వేతారెడ్డి అని ప్రకటించేశారు. అలా శ్వేతారెడ్డీ అడిగిన ఓ ప్రశ్న ఆమెను రాజకీయాల్లోకి తెచ్చింది. పాల్ ఆఫర్ ను సీరియస్ గా తీసుకున్న శ్వేతారెడ్డి హిందూపురంలో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు.

Image result for ప్రజాశాంతి పార్టీలో యాంకర్


హిందూపురంలో ఇప్పటికే టీడీపీ అభ్యర్థిగా బాలకృష్ణ దిగే అవకాశం ఉంది. అలాగే వైసీపీ, జనసేన తరుపున కూడా పోటీ ఉంటుంది. దీంతో మొత్తానికి చతుర్ముఖ పోటీ ఉండే ఛాన్సు ఉంది. మరి అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చిన శ్వేతారెడ్డి హిందూపురంలో నెగ్గుకొస్తారా.. ఇదే ప్రశ్న అడిగితే.. ఏమో రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో చెప్పలేం అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: