ఎక్స్ ప్రెస్ టీవీ అధినేత, పారిశ్రామిక వేత్త జయరామ్ హత్యే కేసు చిక్కుముడి వీడనట్టు తెలుస్తోంది. ఆస్తి కోసం ఈ హత్య జరిగినట్టు తెలుస్తోంది. రెండు రోజులుగా పోలీసులు అనుమానిస్తున్నట్టుగా జయరామ్ మేనకోడలు శిఖా చౌదరే ఈ హత్యకు సూత్రధారి అని తేలినట్టు సమాచారం.

Image result for jayaram sikha chowdary


పోలీసుల విచారణలో శిఖా చౌదరి చెబుతున్న విషయాలు సంచలనం కలిగిస్తున్నాయి. మొదట్లో శిఖా చౌదరితో జయరామ్ కు అక్రమ సంబంధం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు శికా చౌదరే జయరామ్ ను అంతం చేసేందుకు ఓ అమ్మాయిని ప్రయోగించినట్టు తెలుస్తోంది.

Image result for jayaram sikha chowdary


తన పేరున జయరామ్ కొన్న పది ఎకరాల భూమి డాక్యుమెంట్ల కోసం మేనమామకు ఓ యువతిని ఎరవేసినట్టు శిఖా చౌదరి పోలీసుల ఎదుట ఒప్పుకుందని తెలుస్తోంది. తన పేరున పది ఎకరాల భూమిని కొన్న మేనమామ జయరాం ఆ డాక్యుమెంట్లు ఇవ్వలేదని ఆమె చెప్పారట. ఆ డాక్యుమెంట్లు రాబట్టుకునేందుకు శిఖా సెక్స్ వల పన్నిందట.

Image result for jayaram sikha chowdary


ఓ అమ్మాయి మీ కోసం హోటల్లో సిద్దంగా ఉందని సమాచారం ఇచ్చిందట. ఆ యువతి కోసం జయరామ్ వెళ్లిన సమయంలో శిఖా చౌదరి మిత్రుడు రాకేశ్ అతనికి విషపు ఇంజక్షన్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత స్పృహ తప్పిన జయరామ్ ను కారులో నందిగామ వద్ద వదిలేసినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: