ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పై ఏపీ సీఎం తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఏపీ పోలీసు శాఖలో కమ్మ కులానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారని ఈసీకి వైఎస్ జగన్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఒకే కులానికి చెందిన 35 మందికి ప్రమోషన్లు ఇచ్చారని జగన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

Image result for ys jagan vs chandrababu


దీనిపై స్పందించిన ఏపీ సీఎం జగన్ పై కుల పిచ్చి అనే ముద్ర వేసే ప్రయత్నం చేశారు. అభివృద్ధి గురించి మాట్లాడలేకే జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టె ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబు కామెంట్ చేశారు. సామాజిక న్యాయం కోసం పాటు పడే ఏకైక పార్టీ తెలుగుదేశం అన్న చంద్రబాబు అన్ని వర్గాల బాగు కోసమే ఫెడరేషన్ లు పెట్టి ప్రోత్సహిస్తున్నామన్నారు.

Related image


వచ్చే ఎన్నికల్లో పోరాడేందుకు ఏ ఇష్యూలూ లేకపోవడం వల్లే జగన్ కులాన్ని ఎంచుకున్నాడని చంద్రబాబు విమర్శించారు. కులాల మధ్య చిచ్చుకు తెరలేపి రాజకీయ పబ్బం గడుపుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నాడని చంద్రబాబు అంటున్నారు. అంతే కాదు.. జగన్ కు ఉన్న కుల పిచ్చి ఏమిటో అందరికీ తెలుసని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Image result for ys jagan vs chandrababu


తన చిన్నతనం నుంచే సామాజిక న్యాయం కోసమే పోరాడానని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. జగన్ మోడీ పక్షాన ఉండటం చూసి మైనార్టీలు వైసీపీని వదిలేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐతే చంద్రబాబు ఎక్కడా జగన్ చేసిన ఆరోపణలపై నేరుగా వివరణ ఇవ్వలేదు. జగన్ చెప్పింది తప్పు అని కూడా క్లారిటీ ఇవ్వకపోవడం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: