ఏపీని మోడీ దగా చేశారు.. రాష్ట్రానికి ప్రధాని తీరని ద్రోహం చేశారు.. ఏపీకి మోడీ గాయం చేసి ఇప్పుడు పుండుపై కారం చల్లి ఆనందించాలని వస్తున్నారు.. ఇదీ తరచు తెలుగు దేశం నేతలు చెబుతున్న డైలాగులు.. ఇప్పుడు ఈ మాటలకు సమాధానం చెప్పేందుకు మోడీ రెడీ అయ్యారు.
గుంటూరులో నిర్వహించే సభలో మోడీ చంద్రబాబు గుట్టు బయటపెడతారని బీజేపీ నేతలు చెబుతున్నారు. మోడీ గుంటూరులో చేయబోయే ప్రసంగం చిరస్మరణీయంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు వంటి కొందరు నేతలు వయసు పెరిగే కొద్ది చిన్నతనంగా వ్యవహరిస్తారని విమర్శిస్తున్నారు.
మోడీ వంటి నేతలు అంచెలంచెలుగా ఎదిగి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుని సేవలందిస్తారని బీజేపీ ఎంపీ జీవీఎల్ అంటున్నారు. బీజేపీ నేతల మాటలు చూస్తుంటే.. రాష్ట్రానికి బీజేపీ ఎంత మేలు చేసింది.. చంద్రబాబు చేస్తున్న ప్రచారంలో నిజమెంత.. చంద్రబాబు కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా దుర్వినియోగం చేశారు.. అనే అంశాలపై మోడీ వివరింగా ప్రసంగించే అవకాశం కనిపిస్తోంది.
ప్రధాని మోదీ తన పర్యటనలో మూడు జాతీయ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. ఓఎన్ జిసి వశిష్ట ప్రాజెక్టును 5700 కోట్ల వ్యయంతో చేపట్టారు. ఐఎస్ పిఆర్ఎల్ సంస్థను విశాఖలో స్టోరేజీ కెపాసిటీని అబివృద్ది చేయడానికి రెండువేల కోట్ల రూపాయలతో నిర్మించారు. కృష్ణపట్నంలో బిపిసిఎల్ నిర్మించే మరో ప్రాజెక్టుకు ప్రధాని ప్రారంబోత్సవం చేస్తారు.