ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఏపిలో ముఖ్య పార్టీ నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు.  అధికార పార్టీ తాము చేసిన అభివృద్ది పనులను ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నామని..మరోసారి తమను గెలిపిస్తే ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచంలో నెంబర్ వన్ రాష్ట్రాంగా నిలుపుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నారు. 

ఇక విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ని నాలుగేళ్లు పాలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటి వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెబుతూ వస్తున్నారని విమర్శిస్తు ప్రతిపక్ష నాయకులు జగన్ మోహన్ రెడ్డి విమర్శిస్తూ ప్రజల్లోకి వెళ్లారు.  తనకు ఒక్కసారి ముఖ్యమంత్రి హోదా ఇస్తే రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేసి చూపిస్తానని అంటున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్.  ఇలా ఎవరికి వారు హామీలు ఇస్తూ..ఇతర పార్టీలను విమర్శిస్తూ ప్రచారాల్లో మునిగిపోయారు. 

తాజాగా సందిట్లో సడేమియాగా క్రైస్తవ మత ప్రచారకులు కె.ఎ.పాల్ ప్రజాశాంతి తరుపు నుంచి ఎన్నికల బరిలో నిలవబోతున్నానని..ఈ మూడు పార్టీలు ఘోర పరాజయం పొందుతాయని..కాబోయే సీఎం తానేనని భవిష్యత్తు చెబుతున్నారు.  తాజాగా జనసేన, టీడీపీ, వైసీపీలను టార్గెట్ చేస్తూ ఓ ఫన్నీ వీడియోను పాల్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

తమ పార్టీకి ఎన్నికల గుర్తే రాదని కొందరు ఎగతాళి చేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. కానీ ఎన్నికల సంఘం(ఈసీ) తమకు ఓ గుర్తును కేటాయించిందని అన్నారు. ఈసీ ప్రజాశాంతి పార్టీకి ఏ గుర్తును కేటాయించిందో ఊహించి చెప్పాలని నెటిజన్లను కోరారు. ఈ వివరాలను ఫేస్ బుక్, prajasanthi party.org ద్వారా తెలియజేయాలని సూచించారు.  నెటిజన్లు తమ పేరు, అడ్రస్, ఫోన్ నంబర్ ను తెలియజేయాలన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: