చంద్రబాబుకు ఉన్న మీడియా పవర్ సంగతి అందరికీ తెలిసిందే. తెలుగులోని రెండు అగ్ర పత్రికలు ఆయనకు బాకా ఊదుతాయన్న సంగతి బహిరంగ రహస్యం. అందులో ఒకటి ఇన్‌డైరెక్టుగా తెలిసీ తెలియకుండా చంద్రబాబుకు డప్పువాయస్తుంటుంది.



పేరులోనే జ్యోతి ఉన్న మరో పత్రిక మాత్రం బాబుకు బాకా ఊదటంలో తనకెవరూ సాటి వచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెబుతుంది. చంద్రబాబు ఏం చేసినా ఆహో ఓహో అంటూ ఓ రేంజ్‌లో భజన చేస్తుంది. ఇటీవలే ఈ భజనపై మెగా బ్రదర్ నాగబాబు ఓ కామెడీ వీడియో కూడా చేశారు.

Image result for print media


అయితే ఈసారి ఈ మీడియా కూడా చంద్రబాబును ఓటమి నుంచి కాపాడలేదని టీడీపీ నుంచి బయటకు వచ్చిన నాయకులు చెబుతున్నారు. చంద్రబాబు చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉండొచ్చు కానీ ప్రజల్లో చైతన్యాన్ని ఆపడం ఎవరి తరమూ కాదంటున్నారు. వైఎస్సార్‌ మాదిరిగా జగన్‌కు కూడా అవకాశం ఇవ్వాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ధీమాగా చెబుతున్నారు.

Image result for print media


చంద్రబాబు ఎన్ని పథకాలు ప్రకటించినా జగన్‌ విజయాన్ని చంద్రబాబు ఆపలేరని నమ్మకంగా చెబుతున్నారు అవంతి శ్రీనివాస్. చంద్రబాబుకు ఇప్పుడే ప్రజలపై ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో అంతా ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. జగన్‌ రూ.2,000 పింఛన్‌ ఇస్తానని నవరత్నాల్లో ప్రకటిస్తే చంద్రబాబు కాపీ కొట్టి అంతే మొత్తాన్ని ప్రకటించారని అవంతి అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: