ఎన్నికల ముందు టీడీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సహజంగా.. ఎన్నికల ముందు అధికారపార్టీలోకి వలసలు ఉంటుంటాయి. కానీ ఇక్కడ రివర్స్ లో ఉంది. మొన్న ఆమంచి కృష్ణమోహన్.. నిన్న ఎంపీ అవంతి శ్రీనివాస్.. టీడీపీలోకి వెళ్లారు. మరో ఎంపీ కూడా రెడీగా ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఇంకా టీడీపీ నుంచి వలసలు కొనసాగుతాయా.. ఇంకా ఎంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గోడ దూకేందుకు రెడీ అవుతున్నారు.. ఇప్పుడు ఈ చర్చ టీడీపీ, వైసీపీల్లో హాట్ టాపిక్ గా మారింది. అయితే ఆమంచి కృష్ణమోహన్ ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ అంటున్నారు నిన్న పార్టీ మారిన ఎంపీ అవంతి శ్రీనివాస్.

Image result for amanchi and avanthi


ఆమంచి ఓపెనింగ్ బ్యాట్స్ మెన్.. ఈ రోజు నేనొచ్చాను.. ఇంకెంత మంది వస్తారో మీరే చూస్తారు అంటూ షాక్ ఇచ్చాడు అవంతి శ్రీనివాస్. ఆయన మాటలను బట్టి చూస్తే ఇంకా టీడీపీ నుంచి వైసీపీకి వలసలు జోరుగానే ఉండేలా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికల తర్వాత అధికారం కోసం వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి జంప్ చేశారు.

ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో వైసీపీ హవా నడుస్తోంది. జగన్ సీఎం కావడం ఖాయం అన్న టాక్ వినిపిస్తోంది. అందుకే.. రాజకీయ నాయకులు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండటం నాయకుల లక్షణం కదా. చూడాలి ఇంకా ఎంత మంది గోడ దూకుతారో..?


మరింత సమాచారం తెలుసుకోండి: